యాప్నగరం

గుంటూరు: పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న భార్య

లాక్‌డౌన్‌కి ముందు పుట్టింటికి వచ్చిన భార్య తిరిగి వెళ్లలేదు. తల్లిదండ్రుల వద్దే ఉంటున్న ఆమె అనూహ్యంగా ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన గుంటూరు జిల్లాలో జరిగింది.

Samayam Telugu 19 Dec 2020, 2:57 pm
గుంటూరు జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని వివాహిత ఆత్మహత్య చేసుకుంది. వరకట్న వేధింపుల కారణంగానే ఆత్మహత్య చేసుకుందని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. అచ్చంపేట మండలం రుద్రవరం గ్రామానికి చెందిన యువతి గీతారెడ్డి(25)కి కృష్ణా జిల్లాకి చెందిన రవీంద్రరెడ్డితో రెండేళ్ల కిందట వివాహమైంది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
suicide


కొద్దికాలం సాఫీగానే సాగిన కాపురంలో కలహాలు రేగినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్‌కి ముందు పుట్టింటికి వచ్చేసిన గీతారెడ్డి.. అప్పటి నుంచి ఇక్కడే ఉంటోంది. అనూహ్యంగా ఆత్మహత్యకు పాల్పడింది. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి పెట్రోల్ తీసుకుని పక్కనే ఉన్న పొలంలోకి వెళ్లింది. ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంది. మంటల్లో కాలిపోయి ప్రాణాలు విడిచింది. వరకట్న వేధింపుల కారణంగానే తమ కూతురు ఆత్మహత్యకు పాల్పడిందని ఆమె తల్లిదండ్రులు వాపోయారు. సమాచార అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Also Read: ప్రియుడి బైక్‌పై వెళ్తున్న భార్య.. భర్త దారికాచి.. దారుణం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.