యాప్నగరం

ఆత్మహత్య చేసుకున్న అత్త కలలోకి రావడంతో.. కోడలు..

అత్త చనిపోయిందని కోడలు తట్టుకోలేకపోయింది. రోజూ నిద్రలోనూ అవే కలలు వస్తుండడంతో కూతురిని కిరాతకంగా చంపేసి.. తానూ ఆత్మహత్యాయత్నం చేసింది.

Samayam Telugu 4 Aug 2020, 2:59 pm
నట్టింట్లో అత్త విగతజీవిగా కనిపించడంతో తట్టుకోలేకపోయిన కోడలు అఘాయిత్యానికి పాల్పడింది. తన చిన్నారి కూతురు గొంతుకోసి చంపేసి.. తాను కూడా ఆత్మహత్యాయత్నం చేసిన విషాద ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. తిరువణ్ణామలై జిల్లా కీజిరుపక్కం గ్రామానికి చెందిన సుకన్య(28) అత్త కొద్దిరోజుల కిందట ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లోనే ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. ఇంట్లో విగతజీవిగా పడి ఉన్న అత్తని చూసిన సుకన్య డిప్రెషన్‌కి గురైంది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
murder


రోజులు గడిచినా ఆమెలో మార్పు రాలేదు. మానసికంగా కుంగిపోయిన ఆమె ఈలోకాన్ని విడిచివెళ్లాలని నిర్ణయించుకుంది. తన ఆరేళ్ల కూతురిని ఎవరు చూసుకుంటారోనని బెంగ పెట్టుకుందో ఏమో చిన్నారిని కూడా చంపేసింది. కూతురి గొంతుకోసి కిరాతకంగా హతమార్చింది. అనంతరం తాను కూడా ఆత్మహత్యాయత్నం చేసింది. పొలం వెళ్లిన ఆమె భర్త(35) ఇంటికి తిరిగి వచ్చే సరికి భార్యాబిడ్డలు కనిపించలేదు. కంగారుపడిన భర్త ఇల్లంతా వెతకడంతో బాత్రూమ్‌లో రక్తపు మడుగులో అపస్మారక స్థితిలో కనిపించారు.

Also Read: సంసారానికి పనికిరాని కొడుకు.. మనవడు కావాలంటున్న పేరెంట్స్.. చివరికి..

వెంటనే ఇద్దరినీ తిరువణ్ణామలై ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే కూతురు చనిపోయిందని వైద్యులు చెప్పారు. భార్య సుకన్య పరిస్థితి విషమంగా ఉండడంతో చెన్నైకి రిఫర్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. ఇంట్లో అత్త శవాన్ని చూసి కోడలు భయపడిపోయిందని.. నిద్రలో కూడా అలాంటి కలలే వెంటాడడంతో ఆమె ఆత్మహత్యాయత్నం చేసినట్లు భావిస్తున్నారు. పోలీసు దర్యాప్తులో అసలు విషయాలు తేలాల్సి ఉంది.

Read Also: దొంగబాబా కామక్రీడలు.. కోరిక తీర్చకపోతే చేతబడే.. శ్రీకాళహస్తిలో దారుణం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.