యాప్నగరం

పెళ్లి ఇష్టంలేక మహిళా టెక్కీ ఆత్మహత్య... హైదరాబాద్‌లో విషాదం

తన ఇష్టానికి వ్యతిరేకంగా పెళ్లి సంబంధాలు చూస్తున్నారన్న మనస్తాపంతో మహిళా టెక్కీ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన హైదరాాబాద్‌లోని ఎల్బీనగర్‌లో జరిగింది.

Samayam Telugu 7 Aug 2020, 10:55 am
పెళ్లి ఇష్టం లేక మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో గురువారం జరిగింది. రంగారెడ్డి జిల్లా కలకొండ గ్రామానికి చెందిన పులి లింగమ్మ ఎల్‌బీనగర్‌లోని పిండి నారాయణరెడ్డి కాలనీలో కొడుకు కృష్ణ, కుమార్తె లక్ష్మి(27)తో కలిసి ఐదేళ్లుగా నివసిస్తోంది. లక్ష్మి నగరంలోని ఓ సాఫ్ట్‌వేర్ సంస్థలో ఇంజినీర్‌గా పనిచేస్తోంది.
Samayam Telugu Image


Also Read: పరువు హత్య.. ప్రేమలో పడిందని కూతురిని కొట్టి చంపేసిన తండ్రి

ఇటీవల ఆమెకు తల్లి లింగమ్మ పెళ్లి సంబంధాలు చూస్తోంది. బుధవారం పెళ్లి సంబంధం చూసేందుకు ఆమె కొడుకుతో కలిసిఈసీఐఎల్‌‌కు వెళ్లింది. సాయంత్రం ఇంటికొచ్చేసరికి లక్ష్మి ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. ఆమెను కిందికి దించి చూడగా అప్పటికే చనిపోయింది. ఆత్మహత్య చేసుకునే ముందు లక్ష్మి తన స్నేహితుడితో ఫోన్లో మాట్లాడింది.

Also Read: నడిరోడ్డుపై వివాహితకు వేధింపులు.. అడ్డుకున్న భర్త, పోలీసులపై యువకుల దాడి

తనకు పెళ్లి ఇష్టం లేదని, ఆత్మహత్య చేసుకుంటున్నానని అతడికి చెప్పి కాల్ కట్ చేసింది. దీంతో ఆ యువకుడు లక్ష్మి ఇంటికి చేరుకునేసరికే ఉరేసుకుందని కుటుంబసభ్యులు తెలిపారు. తల్లి ఫిర్యాదుతో ఎల్బీనగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. లక్ష్మి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

Also Read: హైదరాబాద్: చైల్డ్‌ పోర్నోగ్రఫీని సెర్చ్‌ చేసిన ఇద్దరి అరెస్ట్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.