యాప్నగరం

పెళ్లైనా వదలని కీచకుడు.. భర్త లేని సమయంలో ఇంటికెళ్లి దారుణం.. చివరికి..

యువతిని బ్లాక్‌మెయిల్ చేసి 15 ఏళ్లుగా అత్యాచారం చేస్తున్నాడో కామపిశాచి. పెళ్లైనా ఆమెను వదల్లేదు. చివరికి ఆమె చేతిలోనే దారుణ హత్య గురయ్యాడు.

Samayam Telugu 17 Oct 2020, 1:25 pm
టీనేజ్ వయస్సులో బాలికను బెదిరించి అత్యాచారం చేశాడో దుర్మార్గుడు. ఆ వీడియోలు తీసి భద్రపరిచి బ్లాక్‌మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. ఆమెకు పెళ్లైనా వదల్లేదు కామాంధుడు. భర్త బయటికెళ్లగానే ఆమెపై అత్యాచారం చేశాడు. కీచకుడి అఘాయిత్యాన్ని భరించలేకపోయిన మహిళ అపర కాళికగా మారింది. తిరగబడి దుర్మార్గుడిని అంతం చేసింది. కత్తితో పొడిచి పొడిచి చంపేసింది. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
harassment


గుణ జిల్లా అశోక్ నగర్‌కి చెందిన శర్మ మహిళను 15 ఏళ్లుగా బ్లాక్‌మెయిల్ చేస్తూ రేప్ చేస్తున్నాడు. ఆమె 16 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు తొలిసారి అత్యాచారం చేసిన శర్మ.. ఆ సమయంలో దారుణాన్ని వీడియోలు తీసుకుని భద్రపరిచాడు. యువతి న్యూడ్ వీడియోలు చూపించి బ్లాక్‌మెయిల్ చేసి తన కోరిక తీర్చుకునేవాడు. పశువులా మీద పడి పైశాచికం ప్రదర్శించేవాడు.

సదరు యువతికి పెళ్లైనా కామపిశాచి విడిచిపెట్టలేదు. భర్త లేని సమయంలో ఇంటికెళ్లి నీచానికి పాల్పడేవాడు. నాలుగు రోజుల కిందట మరోమారు శర్మ బాధితురాలి ఇంటికెళ్లాడు. ఆమె భర్త పనిమీద బయటికెళ్లిన సమయంలో ఇంట్లోకి చొరబడి ఆమెపై అత్యాచారం చేసేందుకు యత్నించాడు. ఇంతకాలం మౌనంగా భరించన భాధితురాలు సహనం కోల్పోయి అపర కాళికగా మారింది. తీవ్రంగా ప్రతిఘటించింది.

Also Read: మహిళ స్నానం చేస్తుండగా వీడియోలు తీసి.. పశ్చిమ గోదావరిలో దారుణం

దుర్మార్గుడిని కత్తితో పొడిచి పొడిచి చంపేసింది. కత్తితో 25 సార్లు కసితీరా పొడిచేసింది. తీవ్రగాయాలపాలైన శర్మని ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. అనంతరం ఆమె పోలీస్ స్టేషన్‌కి వెళ్లి లొంగిపోయింది. కీచకుడు శర్మ కారణంగానే తన జీవితం నాశనమైందని.. భర్త, పిల్లలను వదిలి జైలు జీవితం గడపాల్సి వచ్చిందని ఆమె వాపోయింది.

Read Also: యువకుడి తల తీసుకెళ్లిన ‘రాజధాని ఎక్స్‌ప్రెస్’.. షాకింగ్ ఘటన

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.