యాప్నగరం

పంచాయతీ మహిళా ఉద్యోగి బట్టలూడదీసి.. ఇళ్ల కోసం లంచం తీసుకుందంటూ అమానుషం

ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద నిర్మించి ఇస్తున్న ఇళ్ల కోసం పంచాయతీ సిబ్బంది లంచం తీసుకున్నారంటూ గ్రామస్తులు ఆందోళనకు దిగారు. మహిళా ఉద్యోగిని బయటకు లాగి వివస్త్రను చేసి..

Samayam Telugu 1 Sep 2020, 9:13 pm
సభ్యసమాజం తలదించుకునే దారుణ ఘటన చోటుచేసుకుంది. మహిళను ఆరుబయట నడిరోడ్డుపై బట్టలూడదీయించి నగ్నంగా ఊరంతా తిప్పిన అమానుష ఘటన వెలుగుచూసింది. లంచం తీసుకుందని ఆరోపిస్తూ మహిళా ఉద్యోగిని చెప్పుల దండతో నగ్నంగా ఊరేగించారు ఆందోళనకారులు. ఈ దారుణ ఘటన అసోంలోని బార్పేట జిల్లాలో జరిగింది. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకంలో అవకతవకలు జరిగాయంటూ గ్రామస్తులు ఆందోళనకు దిగారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
harassment


స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయంపై దాడి చేశారు. ఆఫీస్ ఫర్నీచర్, ఎలక్ట్రానిక్ వస్తువులను ధ్వంసం చేశారు. ఫైల్స్, కాగితాలు, ఫర్నీచర్‌ని తగలబెట్టారు. అంతటితో ఆగని ఆందోళనకారులు దారుణానికి పాల్పడ్డారు. పంచాయతీ కార్యాలయంలో విధ్వంసం సృష్టించారు. అదే కార్యాలయంలో పనిచేస్తున్న సీనియర్ మహిళా ఉద్యోగిపై దాడికి దిగారు. ఆమెను దారుణంగా కొట్టారు. లంచం తీసుకుందని ఆరోపిస్తూ నీచానికి పాల్పడ్డారు.

Also Read: పనిలో పడి మర్చిపోయిన భర్త.. కోపంతో భార్య ఘాతుకం

ఆమెను బయటకు లాగి బట్టలూడదీసి అరాచకం సృష్టించారు. మెడలో చెప్పుల దండవేసి ఒంటిపై బట్టల్లేకుండా గ్రామంలో ఊరేగించారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు గ్రామానికి చేరుకుని ఆందోళనకారులను చెదరగొట్టారు. నిందితులను గుర్తించే పనిలో పడ్డారు. ఇప్పటి వరకూ నిందితులను అరెస్టు చేయకపోవడం గమనార్హం.

Read Also:
భర్తని చంపేసి భార్య హైడ్రామా.. సైలెంట్‌గా అంత్యక్రియలు.. తూర్పు గోదావరిలో దారుణం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.