యాప్నగరం

లాక్‌డౌన్ తట్టుకోలేకపోయిన లేడీ టీచర్.. బిల్డింగ్‌ పైనుంచి దూకి..

లాక్‌డౌన్‌తో ఇంటికే పరిమితం కావడంతో లేడీ టీచర్ మానసికంగా కుంగిపోయినట్లు తెలుస్తోంది. డిప్రెషన్‌తో బిల్డింగ్‌ పై నుంచి దూకేసింది.

Samayam Telugu 25 Apr 2020, 7:20 pm
కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు ప్రభుత్వాలు లాక్‌డౌన్ అమలు చేస్తున్న విషయం తెలిసిందే. మే 3 వరకు రెండో విడత లాక్‌డౌన్ కొనసాగుతోంది. లాక్‌డౌన్ కారణంగా ఇంటికే పరిమితమవడంతో కొందరు మానసిక సమస్యలకు లోనవుతున్నారు. డిప్రెషన్‌లో కూరుకుపోయి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. డిప్రెషన్‌కి గురైన ఓ లేడీ టీచర్ అపార్ట్‌మెంట్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన నోయిడాలో చోటుచేసుకుంది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం


నోయిడాలోని సెక్టార్ 78 పరిధిలోని ఓ హౌసింగ్ సొసైటీలో నివాసం ఉంటున్న లేడీ టీచర్ ఆత్మహత్య చేసుకుంది. ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్న భాగవతి బిష్త్(35) లాక్‌డౌన్ కారణంగా డిప్రెషన్‌కి గురైంది. మానసికంగా కుంగిపోయిన టీచర్ తన అపార్ట్‌మెంట్ 17 వ అంతస్తు నుంచి అమాంతం దూకేసింది. తీవ్రగాయాలపాలై అక్కడికక్కడే మరణించింది.

Also Read: కమిషనర్ ఆఫీస్‌కి ఫోన్ చేసి కిరాణా లిస్టు చెప్పిన లేడీ ఐపీఎస్.. ఆరా తీస్తే షాకింగ్

సమాచారం అందుకున్న సెక్టార్ 49 పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్యకు దారితీసిన కారణాలపై ఆరా తీశారు. టీచర్ బిల్డింగ్‌ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుందని.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీసీపీ సంకల్ప్ శర్మ తెలిపారు.

Read Also: ముగ్గురు పిల్లల తండ్రి.. ఆరుగురు పిల్లల తల్లితో రెండో పెళ్లి.. చివరికి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.