యాప్నగరం

తెల్లారేసరికి శవమైన లేడీ టీచర్.. పెట్రోల్ మంటల్లో కాలి.. కృష్ణా జిల్లాలో కలకలం

లేడీ టీచర్ కాలిబూడిదైన సంఘటన వెలుగుచూసింది. మాంసం ముద్దగా మారిన టీచర్‌ ఆత్మహత్య చేసుకున్నారా? లేక గుర్గుతెలియని దుండగులు ఆమెను చంపేసి పెట్రోల్ పోసి తగలబెట్టారా? తేలాల్సి ఉంది.

Samayam Telugu 11 Mar 2020, 4:15 pm
లేడీ టీచర్ అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన వెలుగుచూసింది. పెట్రోల్ మంటల్లో కాలిబూడిదైన టీచర్ మృతదేహాన్ని చూసిన పని మనిషి షాక్‌కు గురైంది. భయపడిపోయిన ఆమె విషయాన్ని స్థానికులకు చెప్పడంతో పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. ఈ విషాద ఘటన కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది.
Samayam Telugu fire1


పెట్రోల్ మంటల్లో కాలిబూడిదైన స్థితిలో ఉపాధ్యాయురాలి మృతదేహం కృష్ణా జిల్లాలో కలకలం రేపింది. వీరులపాడు మండలం జూలూరు హై స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తున్న కార్యంపూడి నాగమణి తెల్లారేసరికి శవమై తేలింది. పెట్రోల్ మంటల్లో కాలిబూడిదైంది. ఉదయాన్నే ఇంటికొచ్చిన పనిమనిషి కాలి మాంసం ముద్దగా మారిన టీచర్‌ని చూసి కేకలు వేయడంతో స్థానికులు వచ్చి పోలీసులకు సమాచారం అందించారు.

Also Read: ‘నాకు సుపారీ ఇస్తానని, మరో ముఠాతో మర్డర్..’ కర్నూల్ హత్య కేసులో అదిరిపోయే ట్విస్ట్

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని.. ఇంటి పరిసరాలను పరిశీలించారు. పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడిందా? లేక ఎవరైనా పెట్రోల్ పోసి దారుణంగా హత్య చేశారా? అన్న కోణంలో ఆరా తీస్తున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. తెల్లారేసరికి పెట్రోల్ మంటల్లో టీచర్ కాలిబూడిద కావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Read Also: కామపిశాచిగా మారిన డాక్టర్.. మహిళలకు మత్తుమందిచ్చి రేప్.. సెక్స్‌ టాయ్స్‌తో వికృతంగా..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.