యాప్నగరం

హైదరాబాద్‌లో మహిళా టెక్కీ ఆత్మహత్య.. కారణాలపై పోలీసుల ఆరా

ఒడిశా నుంచి హైదరాబాద్ వచ్చిన రాజ్యలక్ష్మి జూబ్లీహిల్స్‌లోని ఓ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తోంది. మంగళవారం హాస్టల్ రూమ్‌లోనే ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

Samayam Telugu 13 Feb 2020, 9:23 am
హైదరాబాద్ నగరంలో మహిళా సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్ ఆత్మహత్యకు పాల్పడింది. ఒడిశా గంజాం జిల్లాలోని స్వప్నేశ్వర్‌ ప్రాంతానికి చెందిన రాజ్యలక్ష్మి (25) బీటెక్ చదివింది. కొంతకాలం క్రితం హైదరాబాద్‌కు వచ్చిన ఆమె ప్రస్తుతం జూబ్లీహిల్స్‌లోని ఓ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తోంది. బేగంపేటలోని సిద్ధివినాయక ఉమెన్స్ హాస్టల్‌లో ఉంటోంది.
Samayam Telugu pjimage (8)


Also Read: వాట్సాప్‌లో నగ్నచిత్రాలు పంపించి.. కోరిక తీర్చాలంటూ బాలికకు వేధింపులు

మంగళవారం మధ్యాహ్నం రూమ్‌మేట్స్‌ అందరూ తమ విధుల నిమిత్తం వెళ్లిపోగా రాజ్యలక్ష్మి ఒంటరిగా గదిలోనే ఉండిపోయింది. రాత్రి 12.30 ప్రాంతంలో రూమ్‌మేట్‌ నవీన హాస్టల్‌ గదికి వచ్చి చూడగా రాజ్యలక్ష్మి చున్నీతో ఫ్యాన్‌కు ఉరివేసుకుని వేలాడుతూ కనిపించింది. దీంతో వెంటనే హాస్టల్ నిర్వాహకులు, పోలీసులకు సమాచారం ఇచ్చింది. దీంతో హాస్టల్‌కు చేరుకున్న పోలీసులు రాజ్యలక్ష్మి మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. గదిలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని, ఆమె ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు.

Also Read:బాలికపై కామపిశాచుల పైశాచికత్వం.. ఆర్నెల్లుగా పది మంది మార్చిమార్చి దారుణం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.