యాప్నగరం

గ్రామ వాలంటీర్ల మధ్య ప్రేమ!.. గుంటూరులో మహిళా వాలంటీర్ ఆత్మహత్య

గుంటూరులో జిల్లాలో ప్రేమ వ్యవహారంతో మహిళా గ్రామ వాలంటీర్ ఆత్మహత్య చేసుకుంది. దీనికి కారణం అదే గ్రామానికి చెందిన గ్రామ వాలంటీర్ శ్రీనివాసే కారణమని ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Samayam Telugu 1 Jun 2020, 12:04 pm
ప్రేమ వ్యవహారంతో ఓ మహిళా గ్రామ వాలంటీర్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గుంటూరు జిల్లాలో జరిగింది. దుండిపాలెం గ్రామంలో ప్రభుత్వ వాలంటీర్‌గా పనిచేస్తున్న బాంధవి అనే యువకుడి ఆదివారం ఆత్మహత్య చేసుకుంది. అదే గ్రామానికి చెందిన వాలంటీర్‌ శ్రీనివాస్‌తో ప్రేమ వ్యవహారమే దీనికి కారణంగా తెలుస్తోంది. తమ కుమార్తెను శ్రీనివాస్ తీవ్రంగా వేధించేవాడని, అందువల్లే బాంధవి ఆత్మహత్య చేసుకుందని ఆమెత తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్థులు శ్రీనివాస్‌కు దేహశుద్ధ చేసి పోలీసులకు అప్పగించారు.
Samayam Telugu Image


Also Read: మద్యం మత్తులో భర్తతో గొడవపడిన మహిళ.. తెల్లారేసరికి శవమై

బాంధవి తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ముఖ్యంగా మృతురాలి కుటుంబసభ్యులు చేస్తున్న ఆరోపణల కోణంలో విచారణ చేపట్టినట్లు పోలీసులు చెబుతున్నారు. బాంధవి, శ్రీనివాస్ మధ్య ప్రేమ వ్యవహారం ఉందా? లేక శ్రీనివాస్‌ ఆమెను వేధించాడా? అన్న కోణాల్లో లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ప్రభుత్వం అందించే అన్ని పథకాలు, సౌకర్యాలు ప్రజల ఇంటి వద్దకే చేరాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన వాలంటీర్ల వ్యవస్థ అక్కడక్కడా అభాసుపాలవుతోంది. గ్రామ వాలంటీర్ వేధింపులతో రెండ్రోజుల క్రితం విశాఖ జిల్లాలో మాజీ మంత్రి కారు డ్రైవర్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే.

Also Read: ఇంటర్ బాలికకు ప్రేమ వల.. గర్భవతిని చేసిన పీజీ స్టూడెంట్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.