యాప్నగరం

Pakistan: సమాధి నుంచి వెలికితీసి మహిళ శవంపై అత్యాచారం

మృతురాలి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇది తెలిసిన వారి పనేనని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.

Samayam Telugu 7 Nov 2019, 8:36 am
పాకిస్థాన్‌లో అత్యంత దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. లోథీ పట్టణంలోని ఓ శ్మశానంలో పూడ్చిపెట్టిన మహిళ శవాన్ని వెలికితీసి అత్యాచారానికి పాల్పడటం కలకలం రేపింది. లోథీ పట్టణానికి చెందిన ఓ మహిళ అనారోగ్యంతో చనిపోవడంతో శనివారం స్థానిక ఇస్మాయిల్ గోత్ శ్మశానవాటికలో ఖననం చేశారు. ఆదివారం ప్రార్థనలు చేసేందుకు ఆమె సమాధి వద్దకు వెళ్లిన కుటుంబసభ్యులు, బంధువులు షాకయ్యారు.
Samayam Telugu womans dead body raped by unidentified men at graveyard in pakistan
Pakistan: సమాధి నుంచి వెలికితీసి మహిళ శవంపై అత్యాచారం


Also Read: అక్రమ సంబంధం పెట్టుకున్న భార్యను చంపి భర్త ఆత్మహత్య

ఆమెను ఖననం చేసిన చోట మట్టి తవ్వేసి ఉండటం, మృతదేహం బయటపడి ఉండటం చూసి అంతా కంగుతిన్నారు. మృతదేహంపై అత్యాచారం జరిగినట్లు నిర్ధారించుకుని కాటికాపరిని నిలదీశారు. తనకేమీ తెలీదని ముందు బుకాయించిన అతడు.. తర్వాత ఓ కుక్క వచ్చి మట్టి తవ్విందని చెప్పాడు. అయితే సమాధి మీద పెద్ద బండరాయి పెడితే కుక్క ఎలా తవ్విందని ప్రశ్నించగా నీళ్లు నమిలాడు.

Also Read: భార్యను హనీమూన్‌కి తీసుకెళ్లి.. సెక్స్ వీడియోలు తీయాలంటూ వేధింపులు

దీనిపై మృతురాలి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇది తెలిసిన వారి పనేనని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. మరోవైపు కాటికాపరి పరారీలో ఉండటంతో అతడిపైనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తే నిజానిజాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు చెబుతున్నారు. దేశంలో చనిపోయిన మహిళకే రక్షణ లేనప్పుడు మిగిలిన వారి పరిస్థితి ఏమిటని అక్కడి ప్రజలు ఆందోళన పడుతున్నారు.

Also Read: ముంబై మోడల్‌తో విశాఖలో హైటెక్ వ్యభిచారం.. ఇద్దరు విటుల అరెస్ట్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.