యాప్నగరం

పోలీసుల సడెన్ ఎంట్రీ .. పేకాడుతూ దొరికిన మహిళలు, రూ.30వేలు సీజ్

ఏపీలో పేకాట స్థావరాలపై పోలీసులు దాడులు చేస్తున్నారు. తాజాగా విజయనగరంలో పేకాట ఆడుతున్న మహిళలను పోలీసులు అరెస్ట్ చేసి రూ.30వేలు స్వాధీనం చేసుకున్నారు.

Samayam Telugu 7 Jan 2021, 12:58 pm
ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు పేకాట క్లబ్బులు హాట్‌ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. ఇటీవల గుడివాడలో పేకాట స్థావరాలపై పోలీసులు దాడులు చేయడం, వాటి నిర్వహణ వెనుక మంత్రి కొడాలి నాని హస్తం ఉందని ప్రతిపక్షాలు ఆరోపణలు చేయడం తెలిసిందే. ఈ క్రమంలోనే పేకాట క్లబ్బులపై పోలీసులు కొరఢా ఝళిపిస్తున్నారు. తాజాగా విజయనగరం జిల్లాలోని ఓ పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేశారు.
Samayam Telugu Image


Also Read: వేగంగా వెళ్లిన రైలు.. రెండు ముక్కలైన యువకుడి దేహం.. అసలేమైందో?
ఓ ఇంట్లో పేకాట ఆడుతున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి సడెన్ ఎంట్రీ ఇచ్చారు. అక్కడ పేకాటలో నిమగ్నమైన మహిళలు వారిని చూసి షాకయ్యారు. పురుషులకు తామేమీ తక్కువ కాదంటూ మహిళలు సైతం పేకాట ఆడుతుండటం చూసి పోలీసులు షాకయ్యారు. కొద్దిరోజులుగా నిఘా పెట్టిన పోలీసులు మహిళా ఎస్ఐ నేతృత్వంలో దాడులు చేశారు. సంఘటనా స్థలం నుంచి రూ.30వేల నగదును స్వాధీనం చేసుకుని మహిళలపై కేసు నమోదు చేశారు.

Also Read: ఉసురు తీసిన అప్పులు.. పిల్లలకు విషమిచ్చి దంపతుల ఆత్మహత్య, పెళ్లిరోజే దారుణం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.