యాప్నగరం

మహిళలను వివస్త్రలను చేసి.. అపోహతో అమానుషం.!

మహిళలను కిడ్నాప్ గ్యాంగ్‌గా భావించిన స్థానికులు దారుణానికి పాల్పడ్డారు. మూకుమ్మడిగా దాడి చేయడమే కాకుండా వారిపై అమానుషంగా వ్యవహరించారు. అడ్డుకున్న పోలీసులపైనా ఎదురుదాడికి దిగారు.

Samayam Telugu 18 Apr 2021, 8:07 pm
యూపీలో మరో దారుణం చోటుచేసుకుంది. మహిళలపై మూకుమ్మడి దాడి చేయడమే కాకుండా వారిని వివస్త్రలను చేసి పైశాచికానందం పొందారు. విషయం తెలుసుకుని అదుపులోకి తీసుకునేందుకు వచ్చిన పోలీసులపైనా రాళ్లు రువ్వి వీరంగం వేశారు. ఈ దారుణ ఘటన ఘజియాబాద్‌లో జరిగింది. నగరంలోని అశోక్ విహార్ ప్రాంతంలో సంచరిస్తున్న ముగ్గురు మహిళలను స్థానికులు అనుమానించారు. పిల్లలను ఎత్తుకెళ్లే గ్యాంగ్ అనే అపోహతో అమానుషంగా ప్రవర్తించారు. ముగ్గురు మహిళలపై మూకుమ్మడి దాడి చేసి చితకబాదారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
sad woman


అంతటితో ఆగకుండా సభ్యసమాజం తలదించుకునేలా పైశాచికంగా ప్రవర్తించారు. మహిళలను నడిరోడ్డుపై వివస్త్రలను చేసి అవమానించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి వెళ్లారు. ఈ దుశ్చర్యకు పాల్పడిన నిందితులను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించగా స్థానికులు తీవ్రంగా ప్రతిఘటించారు. పోలీసులపైనా రాళ్లు విసిరారు. దీంతో పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.