యాప్నగరం

తుంగభద్ర కాలువలో విద్యార్థిని గల్లంతు.. తల్లిదండ్రులు మందలించడంతో..

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణ సమీపంలోని తుంగభద్ర దిగువ కాలువలో పదో తరగతి విద్యార్థిని దూకినట్లు తెలుస్తోంది. తల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపానికి గురైన బాలిక కాలువలో దూకి ఆత్మహత్యాయత్నం చేసినట్లు భావిస్తున్నారు.

Samayam Telugu 17 Dec 2019, 7:52 pm
ఈ మధ్య కాలంలో పిల్లలు మరీ సున్నితంగా తయారవుతున్నారు. చిన్నచిన్న కారణాలకే పిల్లలు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తెలంగాణలో బావ వెక్కిరించారని ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఉదంతం వెలుగులోకి వచ్చిన రోజునే.. ఆంధ్రప్రదేశ్‌లో తల్లిదండ్రులు మందలించారని ఓ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసింది.
Samayam Telugu police


Also Read: నల్లగా ఉందని వెక్కిరింపు.. మనస్తాపంతో యువతి ఆత్మహత్య

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణ సమీపంలోని తుంగభద్ర దిగువ కాలువలో పదో తరగతి విద్యార్థిని నీహారిక దూకినట్లు తెలుస్తోంది. తల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపానికి గురైన బాలిక కాలువలో దూకి ఆత్మహత్యాయత్నం చేసినట్లు భావిస్తున్నారు. కాలువ గట్టుపై బాలిక సైకిల్, పుస్తకాలు గుర్తించిన పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది బాలిక ఆచూకీ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.

Also Read: సవతి తండ్రి శాడిజం.. పిల్లాడికి దారుణ శిక్ష, మోకాలిలో మొలకెత్తిన విత్తనాలు!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.