యాప్నగరం

పత్తి తీసేందుకు వెళ్తే పొలంలో యువతి శవం.. షాకింగ్

గుర్తుతెలియని యువతి దారుణ హత్యకు గురైంది. దుండగులు యువతిని చంపేసిన అనంతరం పొలంలో పడేసి పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు తెలుస్తోంది. వారం క్రితమే ఈ హత్య జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు.

Samayam Telugu 12 Nov 2020, 11:03 am
పొలం కౌలు చేసుకుంటున్న రైతు పత్తి తీసేందుకు వెళ్లి షాక్‌కి గురయ్యాడు. పొలంలో యువతి శవం కనిపించడంతో కంగారుపడి వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. గుర్తు తెలియని యువతిని దారుణంగా హత్య చేసి పెట్రోల్ పోసి తగలబెట్టేశారు. ఈ దారుణ ఘటన వనపర్తి జిల్లాలో జరిగింది. కొత్తకోట పట్టణం శ్రీకృష్ణానగర్‌కు చెందిన కతలన్న కొత్తతండా శివారులో వ్యవసాయ భూమిని కౌలుకి తీసుకుని సాగు చేస్తున్నాడు. ఈ ఏడాది పత్తి సాగు చేసిన కతలన్న.. వారం రోజుల కిందట తొలివిడత పత్తి తీయించాడు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
cotton field


మరోమారు పత్తి ఏరేందుకు పొలం వెళ్లాడు. పొలంలో పత్తి ఏరుతుండగా సమీపం నుంచి దుర్వాసన రావడంతో వెళ్లి చూసి షాకయ్యాడు. పొలంలో గుర్తు తెలియని యువతి శవం ఉండడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు యువతి మృతదేహాన్ని పరిశీలించారు. పోలీసు జాగిలాలను రప్పించి ఆధారాలు సేకరించేందుకు యత్నించారు. మృతురాలికి 18 నుంచి 20 ఏళ్ల వయస్సు ఉంటుందని.. దారుణంగా హత్య చేసి పొలంలో పెట్రోల్ పోసి తగలబెట్టి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతురాలి వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు ఆరా తీస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read:
భర్త చనిపోవడంతో ఇద్దరితో వివాహేతర సంబంధం.. చివరకు ఏమైందంటే

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.