యాప్నగరం

గుంటూరు చానల్‌లో యువతి మృతదేహం.. హత్యా? ఆత్మహత్యా?

గుంటూరు జిల్లా మంగళగిరి మండల పరిధిలో ఓ యువతి మృతదేహం లభ్యమైంది. గుంటూరు చానల్ కాల్వలో మంగళగిరి పంప్‌హౌస్ వద్ద యువతి శవాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు.

Samayam Telugu 4 Feb 2020, 5:06 pm
మధ్య వయసున్న గుర్తు తెలియని యువతి మృతదేహం మంగళగిరిలో కలకలం రేపింది. కాల్వలో యువతి శవం కనిపించడం చర్చనీయాంశమైంది. గుంటూరు చానల్‌ కాల్వలో మంగళగిరి మున్సిపల్ పంప్ హౌస్ వద్ద యువతి మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. మృతురాలిని తాడేపల్లి మండలం ప్రకాష్ నగర్ వాసిగా గుర్తించారు.
Samayam Telugu woman death.


యువతి ఎవరు? ఎవరైనా హత్య చేశారా? లేక ఆమె ఆత్మహత్యకు పాల్పడిందా? అన్న విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. మృతురాలి భర్తే హత్య చేసి కాల్వలో పడేశాడన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలోనూ మంగళగిరి స్టేడియం సమీపంలో యువతిని దారుణంగా హత్య చేసిన ఘటన చోటచేసుకుంది. ప్రియుడే ఆమెను అతి కిరాతకంగా చంపి.. ఒంటరిగా ఉన్న తమపై ఎవరో దాడి చేసి చంపేసినట్లు చిత్రీకరించే యత్నం చేశాడు.

Also Read: కృష్ణా జిల్లాలో రోడ్డు ప్రమాదం.. లేడీ టీచర్‌ దుర్మరణం

ఎట్టకేలకు పోలీసులు ఆ కేసును ఛేదించారు. పెళ్లి చేసుకోవాల్సి వస్తుందని ప్రియుడే ఆమెను హత్య చేసినట్లు నిర్ధారించారు. అప్పట్లో ఈ కేసు పెద్ద సంచలనమైంది. మృతురాలిది తాడేపల్లి కావడం గమనార్హం. తాజాగా మరో యువతి మృతదేహం కనిపించడంతో కలకలం రేగింది. ఈ ఘటనపై స్పష్టత రావాల్సి ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.