యాప్నగరం

కామంతో కళ్లుమూసుకుపోయి.. కన్నతల్లిపైనే 3 నెలలుగా అత్యాచారం

మద్యానికి బానిసైన యువకుడు కామంతో కళ్లుమూసుకుపోయి కన్నతల్లిపైనే అత్యాచారానికి పాల్పడ్డాడు. తన కోరిక తీర్చకపోతే ఇద్దరు చెల్లెళ్లు, తమ్ముడిని చంపేస్తానని బెదిరించాడు. కొడుకు అఘాయిత్యాన్ని సహించలేకపోయిన బాధితురాలు చివరికి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Samayam Telugu 13 Dec 2019, 2:26 pm
నవమాసాలు మోసి కని అల్లారుముద్దుగా పెంచిన కన్నతల్లినే చెరబట్టాడో కామాంధులు. వావివరుసలు మరిచి తల్లిపైనే అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌‌లో వెలుగులోకి వచ్చింది. పట్టణానికి చెందిన మహిళ భర్త ఏడేళ్ల క్రితం అనారోగ్యంతో మరణించాడు. దీంతో ఆమె ఆస్పత్రిలో పనిచేస్తూ నలుగురు పిల్లలను పోషిస్తోంది.
Samayam Telugu rape3


Also Read: భార్య, పిల్లలతో కలిసి వ్యాపారి ఆత్మహత్య.. కన్నీరు పెట్టిస్తున్న సెల్ఫీ వీడియో

అయితే తల్లికి అండగా నిలవాల్సిన ఆమె పెద్దకుమారుడు(20) మద్యానికి బానిసయ్యాడు. మద్యం తాగేందుకు డబ్బులు కావాలని తల్లిని తరుచూ వేధించేవాడు. ఇవ్వకపోతే ఆమెను తీవ్రంగా కొట్టాడు. ఇటీవల మరింత ఉన్మాదిలా మారిన ఆ యువకుడు తల్లి అని కూడా చూడకుండా ఆమెపై అత్యాచారం చేశాడు. బాధితురాలు ఈ విషయాన్ని ఎవరికీ చెప్పుకోలేక తనలో తానే బాధపడుతూ వచ్చింది.

Also Read: ‘దిశ’ హత్యాచారం... ఫోరెన్సిక్ నివేదికలో సంచలన విషయాలు

దీన్ని అలుసుగా తీసుకున్న ఆ కామాంధుడు మరింత రెచ్చిపోయాడు. రోజూ తన ఇద్దరు చెల్లెళ్లు, తమ్ముడు పడుకున్నాక తల్లిని గదిలోకి తీసుకెళ్లి బెదిరించి అత్యాచారం చేసేవాడు. తన మాట వినకపోతే అందరినీ చంపేస్తానని బెదిరించేవాడు. అయితే అతడి పైశాచికం మరింత ఎక్కువ కావడంతో బాధితురాలు బుధవారం ఔరంగాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన కొడుకు మూడు నెలలుగా తనపై అత్యాచారానికి పాల్పడుతున్నాడని బాధితురాలు చెప్పడంతో పోలీసులు షాకయ్యారు. వెంటనే కేసు నమోదు చేసి ఈ కామాంధుడిని అరెస్ట్ చేశారు.

Also Read: వాచ్‌మెన్ భార్యతో అఫైర్.. ప్రియురాలి భర్తను బీదర్ తీసుకెళ్లి పెట్రోల్ పోసి సజీవదహనం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.