యాప్నగరం

ప్రేమ పేరుతో రూ.2లక్షలు దోపిడీ.. ప్రియుడి అరెస్ట్, కానిస్టేబుళ్లపై కేసు

తనను ప్రేమ పేరుతో నమ్మించి నగదు, బంగారం దోచుకున్నారని యువతి ఇచ్చిన ఫిర్యాదుతో శివానంద్ అనే యువకుడిని గుంటూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Samayam Telugu 9 Jul 2020, 3:24 pm
గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన ఓ యువతిని ప్రేమ పేరుతో నమ్మించి మోసం చేయడంతో రూ.2లక్షల నగదు, బంగారం దోచుకున్న కేసులో పోలీసులు ముగ్గురిపై కేసు నమోదు చేశారు. నిందితుల్లో ప్రియుడితో పాటు అతడికి సహకరించిన ఇద్దరు కానిస్టేబుళ్లు ఉన్నారు. ప్రధాన నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. నూజండ్ల మండలం జంగాలపల్లెకు చెందిన పులుకూరి శివానంద్‌ అనే యువకుడు నరసరావుపేటకు చెందిన ఓ యువతికి ప్రేమ పేరుతో దగ్గరయ్యాడు. అతడు గతంలో నరసరావుపేట పట్టణంలోని ఓ పురుగుల మందుల దుకాణంలో పనిచేసేవాడు. లాక్‌డౌన్‌ కారణంగా ఉద్యోగం పోవడంతో ఖాళీగా ఉంటున్నాడు.
Samayam Telugu Image


Also Read: భార్యతో హనీమూన్‌కి వెళ్లి ప్రియురాలితో రొమాన్స్.. సెల్‌ఫోన్‌తో గుట్టురట్టు

ఈ క్రమంలోనే మూడు నెలలుగా ఆర్థిక అవసరాల పేరుతో యువతి నుంచి సుమారు రూ.2లక్షల నగదు, రూ.40వేల విలువైన బంగారం తీసుకున్నాడు. శివానంద్‌కు ఈపూరు, రొంపిచర్ల పోలీస్‌‌స్టేషన్లలో పనిచేసే కానిస్టేబుళ్లు అప్పలనాయుడు, శ్రీను సహకరించారు. కొద్దిరోజులుగా శివానంద్ ఆచూకీ తెలియకపోవడంతో యువతి ఆరా తీయగా అతడి బండారం బయటపడింది. దీంతో మోసపోయానని గ్రహించిన ఆమె గుంటూరు రూరల్ ఎస్పీని ఆశ్రయించింది.

Also Read: అన్న భార్యతో సహజీవనం.. గొంతులో పొడిచి చంపేసిన తమ్ముడు

ఎస్పీ ఆదేశాలతో శివానంద్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు అతడు గతంలోనూ పలువురు యువతులను ప్రేమ పేరుతో నమ్మించి మోసం చేసినట్లు గుర్తించారు. దీంతో అతడితో పాటు ఇద్దరు కానిస్టేబుళ్లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసుతో ప్రమేయమున్న మరికొందరిపై కఠినచర్యలు తీసుకుంటామని డీఎస్పీ వీరారెడ్డి తెలిపారు.

Also Read: ఒంటరి ఆంటీతో ముగ్గురి రొమాన్స్.. వీడియోలతో బ్లాక్‌మెయిల్, రూ.లక్షల్లో దోపిడీ

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.