యాప్నగరం

ప్రాణం తీసిన పాత గొడవ.. హైదరాబాద్‌లో యువకుడి దారుణహత్య

శనివారం రైల్వే ట్రాక్ పక్కన గొడవ పడుతున్న అబ్దుల్ ఖాదర్, ఫయాజ్‌లను సాజిద్ సముదాయించాడు. అయితే సాజిద్‌తో ఉన్న పాత గొడవతో ఖాదర్ అతడిని కత్తితో పొడిచి చంపేశాడు.

Samayam Telugu 10 Aug 2020, 9:09 am
పాత కక్షలు ఓ యువకుడి ప్రాణాన్ని బలిగొన్న ఘటన హైదరాబాద్‌లోని చాదర్‌ఘాట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం అర్ధరాత్రి జరిగింది. చాదర్‌ఘాట్‌ మూసానగర్‌ ప్రాంతానికి చెందిన సయ్యద్‌ సాజిద్‌(25) కూలీ పనులు చేస్తుంటాడు. ఇతనిపై అనేక స్టేషన్లలో పిక్‌ పాకెటింగ్‌ కేసులున్నాయి. తన స్నేహితులు అబ్దుల్‌ ఖాదర్‌, ఫయాజ్‌లతో కలిసి చిన్న చిన్న దొంగతనాలు చేస్తుంటాడు. ఈ క్రమంలోనే శనివారం అర్ధరాత్రి ఆజంపురా చమన్‌ రైలుపట్టాల సమీపంలో ఓ విషయమై అబ్దుల్‌ ఖాదర్‌, ఫయాజ్‌లు గొడవ పడుతున్నారు. అదే సమయంలో అక్కడికి చేరుకున్న సాజిద్ జోక్యం చేసుకున్నాడు.
Samayam Telugu Image


Also Read: పరాయి మహిళపై మోజుతో భార్యనే కడతేర్చాడు.. సిద్దిపేటలో దారుణం

అప్పటికే పాత గొడవలను మనసులో పెట్టుకున్న ఖాదర్.. సాజిద్‌‌ను కత్తితో విచక్షణా రహితంగా పొడిచి పరారయ్యాడు. బాధితుడి కేకలు విన్న స్థానికులు చాదర్‌ఘాట్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వెంటనే అక్కడికి చేరుకున్నారు. రక్తపు మడుగులో ఉన్న సాజిద్‌ను సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం చనిపోయాడు. మృతుడి తల్లి సుల్తానా ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. నిందితుడు ఖాదర్ పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read: గుంటూరు: రెండేళ్లకే నరకం చూపించిన భర్త.. పెళ్లి రోజే మహిళ ఆత్మహత్య

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.