యాప్నగరం

హైదరాబాద్‌లో యువకుడి దారుణహత్య.. మద్యం మత్తులో స్నేహితులే

హైదరాబాద్‌ నగరంలోని ఆసిఫాబాద్‌లో శ్రవణ్ అనే యువకుడు దారుణహత్యకు గురయ్యాడు. మద్యం మత్తులో స్నేహితులే అతడికి కొట్టి చంపినట్లు కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Samayam Telugu 18 May 2020, 10:14 am
హైదరాబాద్‌లో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఆసిఫ్‌నగర్‌ పోలీస్‌స్టేషన్ పరిధిలోని హుడా కాలనీలో శ్రవణ్(25) అనే యువకుడి దారుణ స్థితిలో శవమై కనిపించాడు. శ్రవణ్ ఇంటికి సమీపంలో నిన్న ఓ వివాహం జరిగింది. ఆ కార్యక్రమానికి స్నేహితులతో కలిసి హాజరైన అతడు తర్వాత స్నేహితులతో కలిసి బయటకు వెళ్లాడు. రాత్రివేళ అందరూ కలిసి మద్యం తాగారు. అయితే అనూహ్యంగా సోమవారం ఉదయం శ్రవణ్ శవమై కనిపించాడు.
Samayam Telugu శ్రవణ్(ఫైల్ ఫోటో)


Also Read: పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. లైంగిక కోరికలు తీర్చుకుని

ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఆసిఫ్‌నగర్ పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని శ్రవణ్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. స్నేహితులంతా మద్యం తాగుతున్న సమయంలో గొడవ జరిగిందని, దీంతో శ్రవణ్ను వారంతా హాకీ స్టిక్స్, కర్రలతో కొట్టి చంపేశారని మృతుడి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. వారి కుటుంబసభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. శ్రవణ్ స్నేహితులను పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం.
Also Read: గుప్తనిధుల పేరుతో బాలికపై అత్యాచారం.. ప్రకాశం జిల్లాలో కీచక మంత్రగాడు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.