యాప్నగరం

పోలీసు వేధింపులతో యువకుడి ఆత్మహత్య.! బాపట్లలో దారుణం

బాపట్ల బస్టాండ్ ఆవరణలో యువకుడి ఆత్మహత్య సంచలనంగా మారింది. లాక్‌డౌన్ నేపథ్యంలో తిరుపతి నుంచి వస్తున్న యువకుడిని పోలీసులు అడ్డగించి ఇబ్బంది పెట్టడంతో బలవన్మరణానికి పాల్పడ్డాడన్న విమర్శలొస్తున్నాయి.

Samayam Telugu 2 Apr 2020, 10:07 pm
గుంటూరు జిల్లా బాపట్లలో దారుణ ఘటన చోటుచేసుకుంది. లాక్‌డౌన్ నేపథ్యంలో స్వగ్రామానికి వెళ్తున్న యువకుడు బాపట్ల బస్టాండ్‌లో ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. యువకుడిని అడ్డుకున్న పోలీసులు.. స్టేషన్‌కి తీసుకెళ్లి ఇబ్బందులకు గురిచేయడంతో మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. యువకుడు చనిపోయే ముందు తన చావుకు పోలీసులే కారణమంటూ తీసుకున్న వీడియో వైరల్‌గా మారింది.
Samayam Telugu death-by-hanging-


తిరుపతిలో‌ని ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న కృష్ణా జిల్లా కైకలూరుకు చెందిన శ్రీనివాస్.. లౌక్ డౌన్ కారణంగా బైక్‌పై సొంతూరికి బయల్దేరాడు. తిరుపతి నుంచి వస్తున్న శ్రీనివాస్‌ని గుంటూరు జిల్లా బాపట్ల పరిధిలోని వెదుళ్లపల్లి అంతర్ జిల్లా చెక్‌పోస్టు వద్ద పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. అయితే పోలీసులను చూసి భయపడిపోయిన శ్రీనివాస్ బైక్ ఆపకుండా వేగంగా ముందుకు పోనిచ్చినట్లు సమాచారం.

Also Read:
కరోనా కల్లోలం.. ప్రియురాలిని కాల్చేసి ప్రియుడి ఆత్మహత్య.. కారణమదే.!

బైక్ ఆపకుండా వెళ్లిపోవడంతో చెక్‌పోస్టు వద్ద విధుల్లో ఉన్న వెదుళ్లపల్లి ఎస్సై తమ సిబ్బందిని అప్రమత్తం చేశారు. బైక్‌పై పారిపోతున్న శ్రీనివాస్‌ని మరో చెక్‌పోస్టు వద్ద పోలీసు సిబ్బంది అదుపులోకి తీసుకుని వెదుళ్లపల్లి పోలీస్ స్టేషన్‌కి తరలించినట్లు తెలుస్తోంది. లాక్‌డౌన్ నిబంధనల ఉల్లంఘన కింద శ్రీనివాస్‌పై కేసు నమోదు చేసినట్లు సమాచారం. అనంతరం విచారణ పేరుతో శ్రీనివాస్‌ని కొట్టారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఆ రోజు అతనిని అక్కడే ఉంచి మరుసటి రోజు ఉదయం పోలీస్ స్టేషన్ నుంచి పంపించినట్లు తెలుస్తోంది.

బాపట్ల వరకూ లారీలో ఎక్కించి పంపించినట్లు సమాచారం. పోలీసుల వ్యవహార శైలితో అప్పటికే మనస్థాపానికి గురైన శ్రీనివాస్ బాపట్లలో లారీ దిగి కొత్త బస్టాండ్‌కి వెళ్లినట్లు తెలుస్తోంది. అదే బస్టాండ్ ఆవరణలో చెట్టుకు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. అతను చనిపోయే ముందు తన చావుకు వెదుళ్లపల్లి పోలీసులే కారణమంటూ సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది.

Read Also: లాక్‌డౌన్‌: యువతిపై ఆర్మీ జవాన్ ఫైరింగ్.. స్పాట్‌లోనే..

పోలీసుల అత్యుత్సాహం వల్లే యువకుడు మరణించాడన్న విమర్శలు రావడంతో పోలీస్ శాఖ కూడా ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. యువకుడి ఆత్మహత్య ఘటనపై సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాల్సిందిగా అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారిని ఆదేశించినట్లు తెలుస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.