యాప్నగరం

ప్రియురాలు వదిలేసిందని.. రైలుకింద పడి ప్రాణం తీసుకున్నాడు

హైటెక్‌ సిటీ, హఫీజ్‌పేట్‌ రైల్వే స్టేషన్ల పరిధిలో సోమవారం ఉదయం ఓ యువకుడు రైలు దూసుకువస్తున్న సమయంలో రైలు పట్టాలపై పడుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి దగ్గర లభించిన ఆధారాలతో అతడిని మహబూబ్‌నగర్‌ జిల్లా నాగర్‌కర్నూల్‌కు చెందిన పిట్టల రమేష్‌గా గుర్తించారు.

Samayam Telugu 24 Dec 2019, 5:06 pm
ప్రేమలో విఫలమైన ఓ యువకుడు రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన నాంపల్లి రైల్వే పోలీస్‌స్టేషన్‌ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. హైటెక్‌ సిటీ, హఫీజ్‌పేట్‌ రైల్వే స్టేషన్ల పరిధిలో సోమవారం ఉదయం ఓ యువకుడు రైలు దూసుకువస్తున్న సమయంలో రైలు పట్టాలపై పడుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. యువకుడిని చూసిన చాలామంది అతడిని కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.
Samayam Telugu suicide


Also Read: ‘నీ భార్యతో 8ఏళ్లు ఎంజాయ్ చేశా.. ఫోటోలు బయటపెడతా’మాజీ ప్రియురాలి భర్తకు బెదిరింపులు

దీనిపై సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. సంఘటనా స్థలంలో సూసైడ్‌ నోట్‌ స్వాధీనం చేసుకున్నారు. ‘ప్రేమలో విఫలం కావడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుంటున్నాను. నా మరణ సమాచారాన్ని ఎవరికీ తెలియజేయాల్సిన అవసరం లేదు’ అని అందులో రాసి ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

Also Read: ఇద్దరు యువకులతో వివాహిత అఫైర్.. భర్తపై కేసు పెట్టిన పోలీసులు

మృతుడి దగ్గర లభించిన ఆధారాలతో అతడిని మహబూబ్‌నగర్‌ జిల్లా నాగర్‌కర్నూల్‌కు చెందిన పిట్టల రమేష్‌గా గుర్తించారు. ఈ ఘటనపై అతడి కుటుంబసభ్యులకు సమాచారం అందించి, మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. నాంపల్లి రైల్వే పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Also Read: ప్రముఖ మోడల్స్‌తో వ్యభిచారం... రైడింగ్‌లో దొరికిన ఐదుగురు సెక్స్‌వర్కర్లు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.