యాప్నగరం

అత్తింటి ముందే అల్లుడి ఆత్మహత్య.. డైరీలో సంచలన విషయాలు

అత్తారింటి ముందే అల్లుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గుంటూరు నగరంలో చోటుచేసుకుంది. తన చావుకు అత్తమామలే కారణమని రాయడంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Samayam Telugu 15 Mar 2020, 9:11 am
గుంటూరు నగరం అరండల్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. మంగళగిరి పట్టణానికి చెందిన సీహెచ్ మణికంగ(29) శనివారం అత్తగారింటి ముందే సైనేడ్ తాగి ప్రాణాలు తీసుకున్నాడు. రోడ్డుపై గిలగిలా కొట్టుకుంటున్న మణికంఠ నోటివెంట నురగలు రావడాన్ని చూసిన స్థానికులు పురుగుల మందు తాగాడేమోనని అనుకుని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి తీసుకెళ్లేసరికే అతడు చనిపోయాడని డాక్టర్లు నిర్ధారించారు. అతడు తాగించి పురుగుల మందు కాదని సైనేడ్ అని చెప్పడంతో అందరూ షాకయ్యారు.
Samayam Telugu తెుడుదా


Also Read: మత్తు మందిచ్చి 16ఏళ్ల బాలికపై గ్యాంగ్ రేప్... 4 నెలలుగా ముగ్గురు కామాంధుల దుశ్చర్య

మణికంఠ ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసినా అతడి అత్తమామల్లో ఎలాంటి చలనం లేకపోవడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు వారింట్లో తనిఖీ చేయగా ఓ డైరీ దొరికింది. తన చావుకు అత్తమామలే కారణమని రాసి ఉండటంతో వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దీనిపై పూర్తి వివరాలు విచారణ తర్వాత వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.

Also Read: ప్రేమికుల గదికి వెళ్లి... ప్రియుడి ఎదుటే ప్రియురాలిపై పోలీసుల అత్యాచారం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.