యాప్నగరం

క్వారంటైన్‌లో ఉంచిన అధికారులు.. డిప్రెషన్‌తో యువకుడి ఆత్మహత్య

తనకు వైరస్ సోకకపోయినా క్వారంటైన్‌లో ఉంచారన్న ఆందోళనతో శశికుమార్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. తమిళనాడులోని తేని జిల్లాలో ఈ ఘటన జరిగింది.

Samayam Telugu 19 May 2020, 9:39 am
తమిళనాడులో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. రోజూ నమోదవుతున్న వందలాది కేసులతో అక్కడ కరోనా బాధితుల సంఖ్య 7వేలు దాటేసింది. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు అధికారులు అనుమానితులకు పరీక్షలు చేసి క్వారంటైన్‌కు తరలిస్తున్నారు. ఇలాగే కరోనా సోకిందన్న అనుమానంతో క్వారంటైన్‌కు తరలించిన యువకుడు ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. తేని ప్రభుత్వ కళాశాల క్వారంటైన్‌లో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనతో ఆ క్వారంటైన్‌లో ఉన్న వారంతా ఆందోళకు గురవుతున్నారు.
Samayam Telugu Image


Also read: విడాకులకు అప్లై చేసిన భార్య.. మనస్తాపంతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య

తేని జిల్లా ఆండి పట్టికి చెందిన శశికుమార్‌ రెండు రోజుల క్రితం ముంబయి నుంచి స్వగ్రామానికి చేరుకున్నాడు. అతడికి కరోనా పరీక్షలు నిర్వహించిన అనంతరం క్వారంటైన్‌కు తరలించారు. 14 రోజులు క్వారంటైన్‌లోనే ఉండాలని డాక్టర్లు, అధికారులు సూచించారు. అయితే తనకు ఎలాంటి వైరస్‌ లేనప్పుడు క్వారంటైన్‌లో ఎందుకు ఉండాలని శశికుమార్ నిలదీశాడు. అయితే 14రోజులు అక్కడ ఉంటేనే ఇంటికి పంపిస్తామని అధికారులు తేల్చిచెప్పారు. దీంతో మనస్తాపానికి గురైన అతడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. తనను క్వారంటైన్‌కు తరలించారన్న మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడా..? లేదా ఇతర కారణాలేవైనా ఉన్నాయా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also read: బాలికపై అక్క భర్త లైంగిక దాడి.. అబార్షన్ వికటించి బాధితురాలు మృతి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.