యాప్నగరం

రైలు కింద పడి యువకుడి ఆత్మహత్య.. టిక్‌టాక్ వీడియోలతో అసలు ట్విస్ట్

ప్రేమలో విఫలం చెందిన ఓ యువకుడు మనస్తాపంతో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న ఘటన తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట మండలంలో వెలుగుచూసింది.

Samayam Telugu 3 Mar 2020, 1:16 pm
ప్రేమ విఫలం కావడంతో ఓ యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న ఘటన తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలో వెలుగుచూసింది. మండలంలోని వేట్లపాలెం పంచాయతీ హరిజనపేటకు చెందిన బర్రె శేఖర్ కొంతకాలంగా ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. సోమవారం అతడు మేడపాటు సమీపంలో రైలు పట్టాలపై విగతజీవిగా కనిపించడంతో కుటుంబసభ్యులు షాకయ్యారు.
Samayam Telugu pjimage (1)


Also Read: ‘పెళ్లి చేసుకోకపోతే చంపేస్తా’.. గుంటూరు యువకుడికి ఫేస్‌బుక్ ఫ్రెండ్ వేధింపులు


శేఖర్ గతంలో ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేసేశాడు. ఇటీవల ఫైనాన్స్‌పై బైక్ కొన్నాడు. కొద్దిరోజుల క్రితం ఉద్యోగం పోవడంతో బైన్ లోన్ ఈఎంఐలు కట్టలేకపోతున్నాడు. ఆ మనస్తాపంతోనే శేఖర్ ఆత్మహత్య చేసుకుని ఉంటాడని కుటుంబసభ్యులు భావించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Also Read: విద్యార్థినితో హైస్కూల్ టీచర్ కామకలాపాలు.. చిన్న పొరపాటుతో బయటపడిన బెడ్రూమ్ బాగోతం

అయితే పోలీసులు అతడి ఫోన్ పరిశీలించగా ప్రేమ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ‘నువ్వంటే నాకు చాలా ఇష్టం, నువ్వు లేకుండా నేను ఉండలేను. నిన్ను వేరొకరితో ఊహించుకోలేను. మరో జన్మ ఉంటే కలుసుకుందాం. సుఖంగా ఉండు, నిన్ను కష్టపెట్టకూడదనే నేను వెళ్లిపోతున్నా..’ అంటూ శేఖర్ టిక్‌టాక్ వీడియోలు చేశాడు. అయితే శేఖర్ ప్రేమించిన అమ్మాయి ఎవరా? అన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. శేఖర్ ఆత్మహత్యతో అతడి కుటుంబసభ్యులు, స్నేహితులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు.

Also Read: ప్రేమన్నాడు.. పెళ్లికి ముందే తల్లిని చేశాడు... నెల్లూరు యువకుడిపై కేసు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.