యాప్నగరం

వేగంగా వెళ్లిన రైలు.. రెండు ముక్కలైన యువకుడి దేహం.. అసలేమైందో?

ఉత్తర్‌ప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌ పట్టణంలో హర్షవర్థన్ అనే యువకుడిని రైలు ఢీకొట్టింది. దీంతో అతడి దేహం రెండు ముక్కలైంది. 12 గంటల తర్వాత అతడు చనిపోయాడు.

Samayam Telugu 7 Jan 2021, 12:20 pm
ఉత్తర్‌ప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌ పట్టణంలోని రోజా పోలీస్ స్టేషన్ పరిధిలో హృదయ విదారక ఘటన జరిగింది. ట్రైన్ కింద పడి రెండు ముక్కలైన యువకుడు 12 గంటల పాటు మృత్యువుతో పోరాడి ప్రాణాలు కోల్పోయాడు. దేహం రెండు ముక్కలైనా అతడు స్థానికులతో ఏదో చెప్పడానికి ప్రయత్నించడం అందరినీ కలిచివేసింది.
Samayam Telugu Image


హథౌడా బుజుర్గ్ ప్రాంతానికి చెందిన హర్షవర్థన్(19) బుధవారం ఏదో పని నిమిత్తం తల్లి వద్ద డబ్బులు తీసుకుని బయటికి వెళ్లాడు. సమీపంలోని రైలు పట్టాల వద్ద కాసేపటి తర్వాత అతడు చిధ్రమైన శరీరంతో స్థానికుల కంటపడ్డాడు. రెండు ముక్కలైన హర్షవర్ధన్ దేహం కింద భాగం రైలు పట్టాలపై, పై భాగం పక్కనున్న నాలా వద్ద పడింది. అక్కడికి చేరుకున్న స్థానికులంతా హర్షవర్థన్ నాలాలో పడిపోయాడని అనుకున్నారు. తనని రైలు ఢీకొట్టిందని చెప్పినప్పటికీ కొంతసేపటి వరకు వాళ్లకు నమ్మకం కలగలేదు.

నాలాకు దూరంగా శరీర భాగాలు గుర్తించిన స్థానికులు అవి హర్షవర్ధన్‌వేనని నిర్ధారించుకుని వెంటనే అతడిని అంబులెన్స్‌లో హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ 12 గంటల పాటు మృత్యువుతో పోరాడిన అతడు చివరికి ప్రాణాలు కోల్పోయాడు. హర్షవర్ధన్ దేహం రెండు ముక్కలు కావడంతో అతడిని కాపాడలేకపోయామని డాక్టర్లు తెలిపారు. అతడు ప్రమాదవశాత్తూ రైలు కిండ పడ్డాడా? లేక ఆత్మహత్యకు యత్నించాడా? అన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.