యాప్నగరం

మేడ్చల్: తాగిన మత్తులో అతివేగంగా.. బైక్‌పై వెనుక కూర్చున్న యువకుడి దుర్మరణం

హైదరాబాద్ నగరంలో రోడ్డు ప్రమాదం జరిగింది. తాగిన మత్తులో బైక్‌ను అతివేగంగా నడుపుతూ దిమ్మెను ఢీకొట్టడంతో యువకుడు దుర్మరణం పాలయ్యాడు. బైక్ వెనుక కూర్చున్న వ్యక్తి మరణించడం గమనార్హం.

Samayam Telugu 24 Jan 2020, 3:45 pm
మద్యం మత్తులో ర్యాష్ డ్రైవింగ్ మరొకరి ప్రాణం తీసింది. స్నేహితుడితో కలసి ఫంక్షన్‌కు బయల్దేరిన యువకుడు దుర్మరణం పాలయ్యాడు. మందు తాగి అతివేగంగా బైక్ నడుపుతూ రోడ్డు మధ్యలో ఉన్న జెండా దిమ్మెని బలంగా ఢీకొట్టడంతో యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ఈ విషాద సంఘటన మేడ్చల్‌లో చోటుచేసుకుంది.
Samayam Telugu accident-pt


మేడ్చల్‌కి చెందిన మోసిన్ హుస్సేన్(21) తన స్నేహితుడితో కలసి అర్ధరాత్రి వరకూ ఫుల్లుగా మద్యం తాగారు. ఆ తరువాత స్నేహితుడితో కలిసి బైక్‌పై ఫంక్షన్‌కి బయల్దేరాడు. స్నేహితుడు బైక్ నడుపుతుండగా మోసిన్ వెనుక కూర్చున్నాడు. మద్యం మత్తులో ఉన్న స్నేహితుడు ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ సూరారం కాలనీ రోడ్డులో మధ్యలో ఉన్న ఓ జెండా దిమ్మెను బలంగా ఢీకొట్టాడు.

Also Read: ఫ్రెండ్స్ ముందు అలా డ్యాన్స్ చేయమంటున్న భర్త.. సినీ నటికి లైంగిక వేధింపులు

బైక్ ఢీకొన్న వేగానికి వెనుక కూర్చున్న మోసిన్ ఎగిరి కిందపడిపోయాడు. తలకు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్ నడుపుతున్న వ్యక్తికి గాయాలయ్యాయి. తక్షణమే తేరుకున్న మృతుని స్నేహితుడు, ఆ మార్గంలో వెళ్తున్న పలువురు వాహనదారులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. స్పాట్‌కి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు.

Read Also: విద్యార్థినిని ఇంట్లో బంధించి అత్యాచారం.. తూర్పు గోదావరిలో కీచక వార్డెన్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.