యాప్నగరం

బీరు సీసాలతో కొట్టుకున్న స్నేహితులు.. తల పగిలి యువకుడి మృతి

మద్యం మత్తులో ఘర్షణ పడిన స్నేహితుడు బీరు సీసాలతో కొట్టుకున్నారు. ఈ ఘటనలో తలకు గాయంతో ప్రవీణ్‌కుమార్ అనే యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.

Samayam Telugu 6 Jul 2020, 11:14 am
మద్యం మత్తులో స్నేహితుల మధ్య జరిగిన ఘర్షణలో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన నెల్లూరు జిల్లా కావలిలో జరిగింది. పట్టణంలోని అరుంధతిపాలెంకు చెందిన ప్రవీన్‌కుమార్, సౌమిత్, జశ్వంత్, బబ్బు అనే యువకులంతా కలిసి ఆదివారం రాత్రి ముసునూరు ప్రాంతంలో మద్యం సేవించారు. అందరూ మత్తులో ఉండగా ఓ విషయంపై వాగ్వాదం మొదలై అదికాస్తా ఘర్షణకు దారితీసింది. యువకులంతా మద్యం సీసాలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు.
Samayam Telugu Image


Also Read: పిన్నితో యువకుడి అఫైర్.. వేరొకరితో చనువుతో ఉంటోందని హత్య

ఈ ఘటనలో ప్రవీణ్ కుమార్(20) తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. దీంతో సౌమిత్ అతడిని బైక్‌పై కావలి ప్రభుత్వాసుపత్రికి తరలించాడు. డాక్టర్లు అతడిని ఎమర్జెన్సీ వార్డుకు తరలిస్తుండగానే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై హాస్పిటల్‌లో ఓపీ హెడ్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న రమేష్‌కుమార్ కావలి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఎస్ఐ అరుణకుమారి వెంటనే అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. సౌమిత్‌తో పాటు మిగిలిన యువకులను విచారించి ఆధారాలు సేకరించారు. సీఐ అక్కేశ్వరరావు ఆదేశాలతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Also Read: భర్తలేని సమయం చూసి నవవధువుపై అత్యాచారం.. నెల్లూరులో దారుణం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.