యాప్నగరం

బస్సు టైరు కింద పడి నలిగిన ఇంటర్ విద్యార్థి.. చేవెళ్లలో విషాదం

ఫుట్ బోర్డు ప్రయాణం ప్రమాదకరమని చెబుతున్నా పెడచెవిన పెట్టడం వల్ల ఓ నిండు ప్రాణం పోయింది. రన్నింగ్‌లో బస్సు ఎక్కేందుకు ప్రయత్నించి ఇంటర్ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు.

Samayam Telugu 8 Feb 2020, 9:15 pm
తెలంగాణలో విషాద ఘటన చోటుచేసుకుంది. కదులుతున్న బస్సెక్కబోతూ ప్రమాదవశాత్తూ బస్సు కింద పడి మైనర్ బాలుడు మృతి చెందాడు. కాలేజీ ఇంటికెళ్లే క్రమంలో బస్సెక్కేందుకు ప్రయత్నిస్తూ అదే బస్సు కింద పడ్డాడు. అతనిపైకి బస్సు టైరు ఎక్కడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది.
Samayam Telugu bus accident


రంగారెడ్డి జిల్లా చేవెళ్లలోని ఓ కళాశాలలో ఇంటర్ చదువుతున్న విద్యార్థి దుర్మరణం పాలయ్యాడు. కాలేజీ ఇంటికెళ్లేందుకు బస్టాండ్‌కి వచ్చిన విద్యార్థి.. కదులుతున్న బస్సు ఎక్కే ప్రయత్నం చేశాడు. అప్పటికే బస్సు కిక్కిరిసి ఉండడంతో ఎక్కేందుకు వీలు చిక్కలేదు. వెనుక డోర్ నుంచి ఎక్కేందుకు ప్రయత్నించి జనం ఫుట్‌బోర్డ్‌పై వేలాడుతుండడంతో ముందుకి వెళ్లాడు.

Also Read: ఐటీ ఉద్యోగులు చనిపోతే వారికి పండగే.. న్యూస్‌తో వివరాలు సేకరించి.. హైదరాబాద్‌లో హైటెక్ దోపిడీ

బస్సు ముందు డోర్‌ వైపు నుంచి ఎక్కే ప్రయత్నం చేస్తూ అదుపుతప్పి కిందపడిపోయాడు. అప్పటికే నెమ్మదిగా కదులుతున్న బస్సు అతనిపై ఎక్కడంతో తీవ్రగాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం హాస్పిటల్‌కి తరలించారు. ఈ ఘటనతో స్థానికంగా విషాదచాయలు అలముకున్నాయి.

Read Also: యువకుడి సీరియల్ లవ్‌స్టోరీ.. ఒకరితో పెళ్లి.. మరొకరితో చావు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.