యాప్నగరం

భీమవరంలో యువకుడి కిడ్నాప్.. టీడీపీ ఎంపీ గన్‌మెన్‌పై ఆరోపణలు

భీమవరం పట్టణంలో లోకేశ్‌ అనే యువకుడి కిడ్నాప్ కలకలం రేపుతోంది. వారం రోజుల పాటు అతడిని బంధించిన కిడ్నాపర్లు చిత్రహింసలు పెట్టి వదిలేశారు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Samayam Telugu 13 Feb 2020, 1:03 pm
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో యువకుడి కిడ్నాప్ తీవ్ర కలకలం రేపుతోంది. పట్టణానికి చెందిన లోకేశ్ అనే యువకుడిని వారం రోజుల క్రితం కొందరు దుండగులు కిడ్నాప్ చేశారు. అతడిని విశాఖ జిల్లా భీమిలి తీసుకెళ్లిన కిడ్నాపర్లు చిత్రహింసలు పెట్టారు. తల్లిదండ్రులకు ఫోన్ చేసి రూ.2లక్షలు ఇవ్వాలంటూ బెదిరించారు.
Samayam Telugu pjimage (11)


Also Read: పాప తనకు పుట్టలేదన్న భర్త, అదనపు కట్నం కోసం అత్త వేధింపులు.. తట్టుకోలేక

తమ కుమారుడిని ఏమీ చేయొద్దని వారు వేడుకున్నా కనికరించలేదు. డబ్బు ఇస్తేనే లోకేశ్‌ను విడిచిపెడతామని, పోలీసులకు ఈ విషయం చెబితే చంపేస్తామని బెదిరించడంతో వారు ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. రెండ్రోజుల క్రితం ఆ యువకుడిని భీమవరం తీసుకొచ్చిన కిడ్నాపర్లు ఓ ప్రాంతంలో వదిలేసి వెళ్లిపోయారు. తీవ్రగాయాలతో బాధపడుతూనే లోకేశ్ తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో వారు వెంటనే అక్కడికి చేరుకుని అతడిని ఆస్పత్రికి తరలించారు.

Also Read: ప్రియుడితో మహిళా కానిస్టేబుల్ రాసలీలలు... రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న భర్త

అనంతరం బాధితుడి తల్లిదండ్రులు ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. క్రికెట్ బెట్టింగ్ వ్యవహారమే దీనికి కారణమని అనుమానిస్తు్న్నారు. లోకేశ్‌ బెట్టింగ్‌లో కోల్పోయిన మొత్తాన్ని వసూలు చేసుకునేందుకు వారు కిడ్నాప్ చేసి ఉంటారన్న అనుమానం కలుగుతోంది. మరోవైపు తమ కుమారుడిని టీడీపీ రాజ్యసభ సభ్యురాలు సీతామహాలక్ష్మీ గన్‌మెన్ పాండు తన స్నేహితులతో కలిసి కిడ్నాప్ చేయించినట్లు లోకేశ్‌ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. దీంతో ఈ ఘటన రాజకీయ రంగు పులుముకునేలా కనిపిస్తోంది. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేసిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు చెబుతున్నారు.

Also Read: కీచక కానిస్టేబుల్.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి నర్సును లాడ్జికి తీసుకెళ్లి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.