యాప్నగరం

అన్నని కిడ్నాప్ చేసి చెల్లెలికి వీడియో.. అనంతపురంలో దారుణం

వడ్డీ రాబంధులు విరుచుకుపడ్డాయి. యువకుడిని కిడ్నాప్ చేసి దారుణంగా హింసించాయి. ఆమె కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేశాయి.

Samayam Telugu 20 Jun 2020, 4:06 pm
అప్పు తీర్చలేదని యువకుడిని కిడ్నాప్ చేసి చితకబాది ఆ వీడియోను చెల్లెలికి పంపించిన దారుణ ఘటన అనంతపురం జిల్లాలో వెలుగుచూసింది. జిల్లాలోని ధర్మవరానికి చెందిన కార్తీక్ సెల్‌ఫోన్ కొనుక్కునేందుకు వడ్డీ వ్యాపారుల నుంచి నగదు అప్పు తీసుకున్నాడు. అవి తిరిగి చెల్లెంచలేకపోవడంతో వడ్డీ వ్యాపారులు దాష్టీకానికి దిగారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
Kidnap


అర్ధరాత్రి కార్తీక్‌ని కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. తీవ్రంగా కొట్టి హింసిస్తూ వీడియో తీశారు. ఆ వీడియోను బెంగళూరులో ఉంటున్న కార్తీక్ చెల్లెలికి పంపించి బెదిరింపులకు దిగారు. ఐదు లక్షలు ఇవ్వకపోతే అన్నని చంపేస్తామంటూ బెదిరించారు. అన్న వీడియో చూసి ఆందోళనకు గురైన చెల్లెలు హుటాహుటిన ధర్మవరం బయలుదేరింది. ఈ ఘటన ధర్మవరంలో తీవ్ర కలకలం రేపుతోంది.

Also Read:
తుప్పల్లో శవమై తేలిన మహిళా వడ్డీ వ్యాపారి.. కృష్ణా జిల్లాలో దారుణం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.