కరీంనగర్లో యువకుడి దారుణ హత్య.. ప్రేమ వ్యవహారమే.!
ప్రేమ వ్యవహారం మరో యువకుడి ప్రాణాలు బలి తీసుకుంది. యువకుడిని కర్రలతో కొట్టి.. గొడ్డలితో నరికి కిరాతకంగా హత్య చేశారు. ఈ ఘటన కరీంనగర్లో జరిగింది.
Samayam Telugu 20 Oct 2020, 11:49 am
కరీంనగర్ జిల్లాలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యారు. కర్రలతో కొట్టి, గొడ్డలితో నరికి కిరాతకంగా చంపేశారు. ప్రేమ వ్యవహారమే హత్యకు కారణమని భావిస్తున్నారు. వీణవంక మండలం పోతిరెడ్డిపల్లికి చెందిన యువకుడు ప్రణయ్ అదే గ్రామానికి చెందిన అమ్మాయి కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ప్రేమ వ్యవహారం నచ్చని అమ్మాయి కుటుంబ సభ్యులే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇద్దరిదీ ఒకే వర్గంగా తెలుస్తోంది.
రాత్రి మిత్రులతో కలిసి ఉన్న ప్రణయ్పై అర్థరాత్రి ఆయన ఇంటివద్దనే దుండగులు దాడి చేశారు. కొట్టుకుంటూ తీసుకెళ్లి అంబేద్కర్ భవన్ వద్ద నరికి చంపి సమీపంలోని ముళ్ల పొదల్లో పడేశారు. సంఘటన స్థలాన్ని కరీంనగర్ సీపీ కమలాసన్ రెడ్డి సందర్శించి విచారణ చేపట్టారు. హత్య కు ప్రేమ వ్యవహారమే కారణమని భావిస్తున్నారు. దళితుడైన ప్రణయ్ అదే వర్గానికి చెందిన ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నాడని స్థానికులు చెబుతున్నారు. ప్రేమ వ్యవహారంతోనే హత్య చేసినట్లు భావిస్తూ పోలీసులు ఆ దిశగా విచారణ చేపట్టారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని సీపీ తెలిపారు.
Also Read: రాత్రివేళ రూటు మార్చిన ఆటో డ్రైవర్.. భయంతో యువతి.. తూర్పుగోదావరిలో షాకింగ్ ఘటన
రాత్రి మిత్రులతో కలిసి ఉన్న ప్రణయ్పై అర్థరాత్రి ఆయన ఇంటివద్దనే దుండగులు దాడి చేశారు. కొట్టుకుంటూ తీసుకెళ్లి అంబేద్కర్ భవన్ వద్ద నరికి చంపి సమీపంలోని ముళ్ల పొదల్లో పడేశారు. సంఘటన స్థలాన్ని కరీంనగర్ సీపీ కమలాసన్ రెడ్డి సందర్శించి విచారణ చేపట్టారు. హత్య కు ప్రేమ వ్యవహారమే కారణమని భావిస్తున్నారు. దళితుడైన ప్రణయ్ అదే వర్గానికి చెందిన ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నాడని స్థానికులు చెబుతున్నారు. ప్రేమ వ్యవహారంతోనే హత్య చేసినట్లు భావిస్తూ పోలీసులు ఆ దిశగా విచారణ చేపట్టారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని సీపీ తెలిపారు.
Also Read: రాత్రివేళ రూటు మార్చిన ఆటో డ్రైవర్.. భయంతో యువతి.. తూర్పుగోదావరిలో షాకింగ్ ఘటన