యాప్నగరం

అమ్మాయిని వేధిస్తున్నాడని.. బంధువునే కారుతో ఢీకొట్టించి దారుణహత్య

తన మేనకోడలిని వేధిస్తున్న బంధువుల కుర్రాడిని కారుతో ఢీకొట్టి చంపేశాడో ఓ యువకుడు. ఈ ఘటన ప్రకాశం జిల్లా కంభం మండలంలో జరిగింది.

Samayam Telugu 10 May 2020, 10:00 am
ప్రకాశం జిల్లా కంభంలో జరిగిన యువకుడి దారుణహత్య కేసును పోలీసులు చేధించారు. తనను చంపుతాడనే భయంతోనే కాశీశ్వరయ్యను కారుతో ఢీకొట్టి హతమార్చినట్టు పోలీసుల విచారణలో నిందితుడు కరుణాకర్‌ అంగీకరించినట్లు తెలుస్తోంది. ప్రకాశం జిల్లా కంభం మండలం పోరుమామిళ్లపల్లి‌కి చెందిన కాశీవిశ్వేశ్వరరావు విజయవాడలోని ముత్తూట్ ఫైనాన్స్‌ సంస్థలో పనిచేస్తున్నాడు. గోవిందాపురం గ్రామానికి చెందిన వెంకటకరుణాకర్‌ అతడికి బంధువు. విజయవాడలో ఉంటున్న కరుణాకర్‌ మేనకోడలిని కాశీవిశ్వేశ్వరరావు తరచూ వెంటపడి వేధించేవాడు. దీంతో ఇద్దరి మధ్య అనేకసార్లు గొడవలు జరిగాయి. దీనిపై ఒకరికొకరు పోలీస్‌స్టేషన్లో కేసులు కూడా పెట్టుకున్నారు.
Samayam Telugu Image


Also Read: తమ్ముడితో అక్రమ సంబంధం... రూ.2లక్షల సుపారీ ఇచ్చి భర్త హత్య

శుక్రవారం వారిద్దరూ తమ స్నేహితులతో వేర్వేరుగా మద్యం సేవిస్తున్న సమయంలో కాశీవిశ్వేశ్వరరావుకు కరుణాకర్‌ ఫోన్‌ చేసి మందలించాడు. తన మేనకోడలి జోలికి మరోసారి వస్తే ఊరుకునేది లేదని హెచ్చరించాడు. దీంతో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి చంపేస్తామని బెదిరించుకున్నారు. తనను చంపేందుకు కాశీవిశ్వేశ్వరరావు ఆయుధంతో బైక్‌పై వస్తున్నాడని తెలుసుకున్న కరుణాకర్.. కారుతో అతడిని ఢీకొట్టాడు. అతడు చనిపోలేదని నిర్ధారించుకున్న కరుణాకర్.. మరోసారి కారుతో ఢీకొట్టి ప్రాణాలు తీశాడు.

Also Read: భార్య వేరొకరితో తిరుగుతోందన్న అనుమానం.. కత్తితో నరికి చంపిన భర్త

అనంతరం నేరుగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. దీంతో పోలీసులు హతుడు కాశీవిశ్వేశ్వరరావు, నిందితుడు కరుణాకర్‌ సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకుని కాల్‌ రికార్డులను పరిశీలిస్తున్నారు. డీఎస్పీ నాగేశ్వరరెడ్డి, మార్కాపురం సీఐ, ఎస్‌ఐ మాధవరావు సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: పాలు పోసే యువకుడితో ఆంటీ రాసలీలలు.. సడెన్‌గా భర్త రావడంతో

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.