యాప్నగరం

‘ఒరేయ్’ అని పిలిచినందుకు ఘర్షణ.. యువకుడి దారుణహత్య

తనకంటే పెద్దవాడిని ఒరేయ్ అని పిలిచినందుకు జరిగిన గొడవలో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో ఈ ఘటన జరిగింది.

Samayam Telugu 9 Jul 2020, 11:19 am
‘ఒరేయ్’ అనే మాట ఓ యువకుడి ప్రాణం తీసిన ఘటన నెల్లూరు జిల్లా కావలిలో జరిగింది. పట్టణంలోని కచ్చేరిమిట్టకు చెందిన ఓ యువకుడు, వాయినంద ప్రెస్‌ వీధికి చెందిన యంట్రపాటి వెంకటసాయి జస్వంత్‌, పతకమోడి ప్రవీణ్‌ కలిసి బైక్‌పై వెళ్తుండగా అరుంధతీపాలెంకు చెందిన చేవూరి ప్రవీణ్‌కుమార్‌(20), పర్సిపోగు సౌమిత్‌ అనే యువకులు నడుచుకుని వెళ్తూ వారి కంట పడ్డారు. బైక్‌పై ఉన్న యువకుడు ప్రవీణ్‌ను ఉద్దేశించి.. ‘రేయ్‌ ఎక్కడికి పోతున్నారు’ అని అడిగాడు. ‘నీకంటే సీనియర్‌ని.. నన్ను ఒరేయ్‌ అంటావా’ అని ప్రవీణ్‌ అతడిని నిలదీయడంతో ఇద్దరి మద్య వాగ్వాదం జరిగింది.
Samayam Telugu Image


Also Read: కొత్త ఇంట్లోనే యజమానిరాలిపై హత్యాచారం.. హైదరాబాద్‌లో ఘోరం

దీంతో బైక్‌పై ఉన్న యువకులంతా కలిసి ప్రవీణ్‌కుమార్‌పై విచక్షణా రహితంగా దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన అతడిని స్థానికులు కావలి ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న కావలి గ్రామీణ సీఐ అకేశ్వర్‌రావు, ఎస్ఐలు మాల్యాద్రి, అరుణకుమారి విచారణ జరిపారు. బుధవారం ముసునూరు సమీపంలో నిందితులు జస్వంత్‌, మరో యువకుడిని అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు మైనర్‌ కావడంతో బాల నేరస్థుడు కింద కేసు నమోదు చేసి జువైనల్ హోమ్‌కు తరలించారు.

Also Read: ‘4 నెలలు నన్ను వాడుకుని వదిలేశాడు’.. ప్రియుడిపై యువతి ఫిర్యాదు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.