యాప్నగరం

బైక్‌పై ఇంటికొస్తూ యువకుడి దుర్మరణం.. ఖమ్మంలో విషాదం

ఇంటికి వెళ్లే ఆత్రుతలో అతివేగంగా బండి నడుపుతూ ప్రమాదానికి గురై యువకుడు ప్రాణాలు కోల్పోయిన విషాద సంఘటన తెలంగాణలో చోటుచేసుకుంది.

Samayam Telugu 3 Apr 2020, 7:09 pm
లాక్‌డౌన్ వేళ ఎక్కడి వారు అక్కడే ఉండాలని ప్రభుత్వం చెబుతున్నా పెడచెవిన పెట్టి మరీ కొందరు స్వగ్రామాలకు వెళ్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఖమ్మంకి చెందిన ఓ యువకుడు హైదరాబాద్ నుంచి బైక్‌పై వస్తూ ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయిన ఘటన తాజాగా వెలుగుచూసింది. ఖమ్మం చర్చి కాంపౌండ్ ఏరియాకి చెందని అర్షద్ పాషా(23) బీటెక్ పూర్తి చేసి హైదరాబాద్‌లో ఉద్యోగాన్వేషణలో ఉన్నాడు.
Samayam Telugu death3


కరోనా వైరస్ విజృంభణతో ప్రభుత్వాలు లాక్‌డౌన్ ప్రకటించడంతో హైదరాబాద్‌లోనే ఉండిపోయాడు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి ఖమ్మం వచ్చేందుకు ఉదయం బైక్‌పై బయలుదేరాడు. మరికొద్దిసేపట్లో ఇంటికి చేరతాననుకున్న సమయంలో యువకుడు ప్రమాదానికి గురయ్యాడు. ఖమ్మం రూరల్ మండలం మద్దులపల్లి వద్ద బైక్ అదుపుతప్పి కల్వర్టుకు ఢీకొట్టడంతో కిందపడిపోయాడు.

Also Read: కరోనా: ఇంట్లో ఉండమన్నందుకు దారుణం.. తుపాకీతో కాల్చి..

ఈ ప్రమాదంలో అర్షద్‌ పాషాకు తీవ్రగాయాలు కావడంతో స్థానికులు స్పందించి అతనిని ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే మార్గం మధ్యలోనే పాషా మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అతివేగం కారణంగానే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

ఇలాంటి సంఘటనే రెండు రోజుల కిందట ఏపీ తెలంగాణ బోర్డర్‌లో చోటుచేసుకుంది. పోలీసుల కళ్లుగప్పి బైక్‌పై వేగంగా వెళ్లి బోర్డర్ చెక్‌పోస్టు దాటిన యువకులు.. అదే వేగంతో వెళ్లి ముందున్న మరో చెక్‌పోస్టు గేటును చూసుకోకుండా ఢీకొట్టారు. ఈ ఘటనలో ఇద్దరు యువకులు గాయపడ్డారు. బైక్ నడుపుతున్న వ్యక్తి తీవ్రగాయాల పాలవడంతో పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరో యువకుడు పోలీసులు పట్టుకుంటారన్న భయంతో పారిపోయాడు.

Read Also: పడక సుఖం కోసం పాకులాడిన మహిళ.. కొత్త ప్రియుడి మోజులో పడి.. కడపలో దారుణం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.