యాప్నగరం

గుంటూరు: యువకుడి దారుణ హత్య.. రోకలిబండతో కిరాతకంగా కొట్టి..

అక్రమ సంబంధాలు దారుణాలకు దారితీస్తున్నాయి. మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడన్న కోపంతో యువకుడిని కిరాతకంగా హత్య చేసిన ఘటన గుంటూరులో జరిగింది. పోలీసులు విచారణ చేపట్టారు.

Samayam Telugu 19 Mar 2020, 7:55 pm
గుంటూరులో దారుణ హత్య చోటుచేసుకుంది. యువకుడిని రోకలిబండతో అతికిరాతకంగా కొట్టి చంపిన ఘటన కలకలం రేపింది. నగరంలో పట్టాభిపురం భాగ్యనగర్‌లో ఈ దారుణ ఘటన జరిగింది. వివాహేతర సంబంధం నేపథ్యంలో హత్య జరిగినట్లుగా తెలుస్తోంది. నగరానికి చెందిన షేక్ నాగకుమార్ అనే యువకుడి తలపై రోకలిబండతో విచక్షణారహితంగా కొట్టడంతో అక్కడికక్కడే కుప్పకూలినట్లు తెలుస్తోంది.
Samayam Telugu murder.


Read Also: నా మొగుడ్ని చంపేస్తే బాగుండేది కదా.! ప్రియుడితో భార్య .. గుంటూరులో దారుణం

అక్రమ సంబంధం పెట్టుకున్నాడన్న కోపంతో మంగరాజు, పుల్లయ్య అనే ఇద్దరు వ్యక్తులు నాగకుమార్‌పై దాడి చేసి హతమార్చినట్లు సమాచారం. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. నాగకుమార్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పట్టాభిపురం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read: రూ.5 కోట్ల నుంచి రూ.5 లక్షలకు బేరం.. ధైర్యం సరిపోక దారుణం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.