యాప్నగరం

యువకుడిని కొట్టి చంపిన స్నేహితులు.. ఫిలింనగర్‌లో దారుణం

Hyderabad Crime News | ఓ యువకుడిని అతడి స్నేహితులే దారుణంగా హత్య చేశారు. గంజాయి సేవిద్దామని పిలిచి హత్య చేసినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లోని ఫిలింనగర్‌లో ఈ దారుణం చోటుచేసుకుంది.

Samayam Telugu 29 Jul 2019, 11:08 pm
హైదరాబాద్‌లోని ఫిలింనగర్‌లో దారుణం చోటుచేసుకుంది. ప్రేమ్ అనే యువకుడిని అతడి స్నేహితులే దారుణంగా హతమార్చారు. ప్రేమ్, సతీశ్ ఇద్దరు స్నేహితులు ఫిలింనగర్‌లో నివాసం ఉంటున్నారు. కుటుంబసభ్యులు చెప్పిన వివరాల ప్రకారం.. సోమవారం (జులై 29) మధ్యాహ్నం సతీశ్ అనే యువకుడు గంజాయి తాగుదామని ప్రేమ్‌ను పిలిచినట్లు తెలుస్తోంది. ఇద్దరూ కలిసి గంజాయి సేవించిన అనంతరం ఆ మత్తులో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో సతీశ్ అతడిపై పిడిగుద్దుల వర్షం కురిపించాడు.
Samayam Telugu Prem
ఫిలింనగర్ హత్య


సతీశ్‌తో పాటు మరి కొంత మంది యువకులు ప్రేమ్‌పై దాడికి పాల్పడ్డట్లు తెలుస్తోంది. తీవ్రంగా గాయపడ్డ ప్రేమ్ అక్కడిక్కడే మృతి చెందాడు. ప్రేమ్‌కి, సతీశ్‌కి కొంతకాలంగా విభేదాలు ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.