యాప్నగరం

హైదరాబాద్‌లో యువకుడి హత్య.. మద్యం మత్తులో స్నేహితుల ఘాతుకం

హైదరాబాద్ జగద్గిరిగుట్ట సమీపంలో హఫీజ్ అనే యువకుడు దారుణహత్యకు గరయ్యాడు. మద్యం మత్తులో అతడి స్నేహితులే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులను అనుమానిస్తున్నారు.

Samayam Telugu 27 May 2020, 8:15 am
హైదరాబాద్‌లో ఓ వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు. జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలోని రొడా మిస్ట్రీనగర్‌ ముస్లీమ్ గ్రేవియార్డ్ వద్ద హఫీజ్(21) అనే వ్యక్తిని కొందరు వ్యక్తులు బండరాయితో తీవ్రంగా కొట్టి చంపేశారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసలుు సంఘటనా స్థలాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించారు. ఘటనాస్థలిలో మద్యం సీసాలు ఉండటంతో మద్యం మత్తులోనే ఈ ఘటన జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు.
Samayam Telugu Image


Also Read: నడిరోడ్డుపైనే వివాహితపై అఘాయిత్యం.. ఆదిలాబాద్‌లో దారుణం

అక్బర్, అన్ను, సలీమ్ అనే వ్యక్తులను నిందితులుగా అనుమానిస్తూ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వీరంతా హఫీజ్‌కు స్నేహితులేనని పోలీసులు తెలిపారు. అయితే హత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదని, త్వరలోనే అన్ని విషయాలు వెల్లడిస్తామని తెలిపారు.

Also Read: కాళ్లు చేతులు విరగ్గొట్టి, బండరాయితో మోది.. మెదక్ జిల్లాలో వ్యక్తి దారుణహత్య

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.