యాప్నగరం

వరంగల్‌లో ప్రేమోన్మాదం.. ఇంటర్ బాలికను బీరు సీసాతో పొడిచిన యువకుడు

కొంతకాలంగా ప్రియురాలు తనను దూరం పెట్టిందని కక్ష పెంచుకున్న నిఖిల్ బుధవారం ఆమె ఇంటికి వెళ్లి బీరు సీసాతో పొడిచాడు. ఆమె కేకలు వేయడంతో పరారయ్యాడు.

Samayam Telugu 18 Jun 2020, 9:13 am
వరంగల్ నగరంలో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. తనను దూరం పెట్టిందన్న అక్కసుతో ప్రియురాలిపై బీరు సీసాతో దాడి చేశాడు. వరంగల్‌ లేబర్‌కాలనీకి చెందిన యువతి(17) ఇటీవలే ఇంటర్‌ ఫస్టియర్ పూర్తి చేసింది. అదే ప్రాంతానికి చెందిన నిఖిల్(19) అనే యువకుడితో కొంతకాలంగా ప్రేమ వ్యవహారం నడిపిస్తోంది. ఈ విషయం తెలుసుకున్న యువతి తల్లిదండ్రులు ఆమెను బయటకు వెళ్లనివ్వడం లేదు. సెల్‌ఫోన్ కూడా అందుబాటులో ఉండకపోవడంతో ప్రియుడితో మాట్లాడేందుకు కూడా అవకాశం లేకుండా పోయింది.
Samayam Telugu గాయాలతో యువతి


Also Read: కన్నబిడ్డనే గర్భవతిని చేసిన తండ్రి.. హైదరాబాద్‌లో దారుణం

ఈ విషయం తెలియని నిఖిల్ ప్రియురాలు తనను దూరం పెట్టిందని కక్ష పెంచుకున్నాడు. తనకు దక్కనికి ఎవరికీ దక్కకూడదన్న అక్కసుతో ఆమె ప్రాణం తీయాలనుకున్నాడు. బుధవారం ప్రియురాలి ఇంటికి వెళ్లి బీరు సీసా పగులగొట్టి దానితో ఆమెను అనేకచోట్ల పొడిచాడు. బాధితురాలు కేకలు వేయడంతో అక్కడికి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిని యువతిని కుటుంబసభ్యులు వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి తల్లి ఫిర్యాదుతో మిల్స్ కాలనీ పోలీసులు నిఖిల్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. సీఐ నరేశ్‌కుమార్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. ఈ ఘటనలో వరంగల్ నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.

Also Read: బాలిక స్నానం చేస్తుండగా వీడియో తీసి.. కోరిక తీర్చాలంటూ వేధింపులు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.