యాప్నగరం

రైలు పట్టాలపై శవమైన యువకుడు.. అత్తింటి వేధింపులే కారణమా?

గురువారం ఉదయం రైలు పట్టాలపై దినేష్ శవమై కనిపించాడు. భార్య, అత్తింటి వేధింపుల వల్లే అతడు ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.

Samayam Telugu 7 Aug 2020, 11:59 am
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మందమర్రి రైల్వేలైన్ వద్ద ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితితో మృతి చెందాడు. కాగజ్‌నగర్‌కు చెందిన ఇగురపు చంద్రయ్య, సుందరి దంపతుల కుమారుడు దినేష్‌ (29)కు మూడేళ్ల క్రితం జైపూర్‌ మండలం ఇందారానికి చెందిన అమలతో వివాహమైంది. పెళ్లి తర్వాత దినేష్‌కు సింగరేణిలో ఉద్యోగం ఇప్పిస్తామని అత్తింటి వారు హామీ ఇచ్చారు.
Samayam Telugu దినేష్(File Photo)


Also Read: రూ.2వేల కోసం తల్లిని హతమార్చిన కొడుకులు.. మద్యం మత్తులో ఘాతుకం

అయితే ఎన్ని రోజులైనా అత్తమామలు ఉద్యోగం ఊసెత్తకపోవడం, వారింటికి వెళ్లినప్పుడు మర్యాద ఇవ్వకపోవడంతో దినేష్ మనస్తాపానికి గురయ్యేవాడు. దీనిపై దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. కొద్దిరోజుల తర్వాత జైపూర్‌ పవర్‌ప్లాంట్‌లో కాంట్రాక్టర్‌ వద్ద స్కిల్డ్‌ వెల్డర్‌గా పనిలో చేరాడు. వారం రోజుల క్రితం దంపతుల మధ్య మరోసారి గొడవ జరగడంతో అమల పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ క్రమంలోనే గురువారం మందమర్రి రైల్వే లైన్ సమీపంలో దినేష్ రైలు పట్టాలపై శవంగా కనిపించాడు.

Also Read: పెళ్లి ఇష్టంలేక మహిళా టెక్కీ ఆత్మహత్య... హైదరాబాద్‌లో విషాదం

ఈ ఘటనపై సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై దినేష్ తల్లిదండ్రులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తమ కొడుకు మరణానికి భార్య అమల, అత్తమామలే కారణమని వారు ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై జీఆర్‌పీ పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Also Read: నడిరోడ్డుపై వివాహితకు వేధింపులు.. అడ్డుకున్న భర్త, పోలీసులపై యువకుల దాడి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.