యాప్నగరం

‘పోలీస్ దెబ్బ’కి భయపడి పారిపోతూ యువకుడి.. కర్నూల్‌లో విషాదం

అప్పటి వరకూ స్నేహితులతో ముచ్చట్లు చెప్పిన యువకుడు అకస్మాత్తుగా చనిపోయాడు. పోలీసులు కొడతారన్న భయంతో పరిగెడుతూ ప్రాణాలొదిలేసిన విషాద ఘటన చోటుచేసుకుంది.

Samayam Telugu 27 Mar 2020, 5:13 pm
పోలీస్ లాఠీ దెబ్బ తినాల్సి వస్తుందేమోనని పరిగెడుతూ ఓ యువకుడు మరణించిన విషాద సంఘటన వెలుగుచూసింది. గ్రామంలో రాత్రివేళ స్నేహితులతో కూర్చుని మాట్లాడుకుంటున్న సమయంలో సడెన్‌గా పెట్రోలిగ్ వాహనం రావడం చూసి తలోదిక్కు పరారయ్యారు. పోలీసులు కొడతారన్న భయంతో పరిగెత్తిన యువకుడు అమాంతం కిందపడిపోయి మృత్యువాతపడ్డాడు. ఈ విషాద ఘటన కర్నూలు జిల్లాలో జరిగింది.
Samayam Telugu death3


ఆదోని మండలం పెద్దహరివణం గ్రామానికి చెందిన సిద్ధయ్య స్వామి, గౌరమ్మ దంపతుల కుమారుడు వీరభద్రస్వామి బెంగళూరులో పనికి వెళ్లేవాడు. కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో గ్రామానికి వచ్చాడు. రాత్రి సమయంలో స్నేహితులతో కలసి గ్రామానికి సమీపంలో రహదారి పక్కన కూర్చుని మాట్లాడుకుంటున్న సమయంలో పోలీస్ పెట్రోలింగ్ వాహనం వచ్చింది.

Also Read: నగరం నడిబొడ్డున అపార్ట్‌మెంట్లో గంజాయి వనం.. 14వ అంతస్తులో.. మామూలుగా లేదు

ఎవరూ బయటకి రావొద్దని చెబుతుంటే రోడ్లపై ఏం చేస్తున్నారంటూ పోలీసులు వెంబడించడంతో యువకులు తలోదిక్కున పారిపోయారు. పోలీసు లాఠీ దెబ్బలు తినాల్సి వస్తుందన్న భయంతో వీరభద్ర స్వామి పరిగెత్తుతూ ప్రమాదవశాత్తూ కిందపడి చనిపోయాడు. అప్పటి వరకూ బాగానే ఉన్న యువకుడు హఠాత్తుగా మరణించడం గ్రామంలో విషాదం నింపింది. చేతికందొచ్చిన కొడుకు హఠాన్మరణం ఆ తల్లిదండ్రులను కుంగదీసింది.

Read Also: ‘ బాయ్‌ఫ్రెండ్‌పై మూత్రం పోశాడని..’ కన్నకొడుకుపై రాక్షసి అమానుషం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.