యాప్నగరం

పుణ్యస్నానానికి వెళ్లిన యువతిని లాక్కెళ్లి పైశాచికం.. మకర సంక్రాంతి రోజు దారుణం

ఒడిశాలోని బరిపాడ పట్టణంలో దారుణం జరిగింది. మకర సంక్రాంతి సందర్భంగా పుణ్యస్నానానికి వెళ్లిన యువతిని ఇద్దరు వ్యక్తులు లాక్కెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

Samayam Telugu 15 Jan 2021, 7:58 am
సంక్రాంతి పండగ వేళ ఒడిశాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మకర సంక్రాంతి సందర్భంగా నదిలో పుణ్యస్నానం చేసేందుకు వెళ్లిన యువతిపై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన గురువారం ఉదయం మయూర్‌భంజ్ జిల్లా బారిపాడ జరిగింది. పట్టణానికి చెందిన ఇద్దరు యువతులు గురువారం ఉదయం పుణ్యస్నానం చేసేందుకు నది ఒడ్డుకు వెళ్లారు.
Samayam Telugu Image


ఓ యువతి స్నానం చేస్తుండగా మరో యువతి ఒడ్డును ఒంటరిగా నిల్చుని ఉంది. ఆమెను గమనించిన అదే ప్రాంతానికి చెందిన ఇద్దరు యువకులు యువతిని నిర్మానుష్య ప్రాంతానికి ఎత్తుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలు గట్టిగా కేకలు వేయడంతో నిందితులిద్దరూ పరారయ్యారు. యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన బారిపాడ పోలీసులు నిందితులిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం పీఆర్ఎం మెడికల్ కాలేజీకి తరలించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.