యాప్నగరం

పెళ్లి ఫిక్స్ చేసిన తల్లిదండ్రులు.. ఇష్టం లేక యువతి ఆత్మహత్య

తల్లిదండ్రులు తనకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారన్న మనస్తాపంతో తమిళనాడుకు చెందిన యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన నెల్లూరులో జరిగింది.

Samayam Telugu 10 Jul 2020, 1:41 pm
ఆమెకు ఇద్దరు అక్కలంటే ఎంతో అభిమానం. వారిలాగానే నెల్లూరు యువకుడిని పెళ్లి చేసుకుని అక్కడే స్థిరపడాలని కోరుకుంది. కానీ తల్లిదండ్రులు ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా సొంతూరిలో పెళ్లి సంబంధం నిశ్చయించడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుంది. తమిళనాడులోని తంజావూరుకు చెందిన రాజేశ్వరి (23) కొంతకాలంగా కోయంబత్తూరులో ఉద్యోగం చేస్తోంది. మార్చి నెలలో నెల్లూరులో ఉంటున్న అక్కల ఇంటికి వచ్చిన ఆమె లాక్‌డౌన్ కారణంగా అక్కడే ఉండిపోయింది. ఇటీవల తంజావూరులో రాజేశ్వరి తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు.
Samayam Telugu Image


Also Read: బాలికను గర్భవతిని చేసిన మేనమామ.. వికారాబాద్‌ జిల్లాలో దారుణం

అయితే తనకు సొంతూరికి చెందిన యువకుడిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని, అక్కల మాదిరిగానే తనకూ నెల్లూరులో పెళ్లి సంబంధం చూడాలని రాజేశ్వరి కోరింది. ఆమె నిర్ణయాన్ని వ్యతిరేకించిన తల్లిదండ్రులు తాము చూసిన సంబధమే చేసుకోవాలని ఒత్తిడి తెచ్చారు. దీంతో మనస్తాపానికి గురైన ఆమె బుధవారం ఇంట్లో ఉరేసుకుంది. ఆమెను గమనించిన కుటుంబసభ్యులు వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించింది. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో వేదాయపాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Also Read: ప్రేమపెళ్లికి నిరాకరించిన పెద్దలు... ఉరేసుకుని యువతి ఆత్మహత్య

Also Read: హిజ్రాలే అతడి లక్ష్యం.. సహజీవనం చేసి సొమ్ముతో ఉడాయిస్తాడు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.