యాప్నగరం

కట్నం రూ.5వేలు తగ్గిందని భర్త వేధింపులు.. నవవధువు ఆత్మహత్య

కట్నం రూ.50వేలు ఇస్తామని చెప్పిన రత్నకుమారి తల్లిదండ్రులు పెళ్లి సమయంలో కేవలం రూ.45వేలు మాత్రమే ఇవ్వగలిగారు. దీంతో రూ.5వేల కోసం గోపి భార్యను చిత్రహింసలు పెట్టాడు.

Samayam Telugu 9 Jun 2020, 12:55 pm
ఎన్నో ఆశలతో వివాహ జీవితంలోకి అడుగుపెట్టిన యువతిని కట్న వేధింపులు బలి తీసకున్న ఘటన గుంటూరు జిల్లాలో విషాదం నింపింది. నెల రోజుల పాటు హాయిగా సాగిపోయిన ఆమె వైవాహిక జీవితం రెండో నెలకే నరకంగా మారిపోయింది. కట్నం తక్కువగా ఇచ్చారన్న కోపంతో భర్త వేధించడంతో మనస్తాపానికి గురైన ఆమె చివరికి బలవన్మరణానికి పాల్పడింది. తాడికొండ మండలం పాములపాడు గ్రామానికి చెందిన రత్నకుమారి (20)కి లాం గ్రామానికి చెందిన తాపీమేస్త్రి అన్నపురెడ్డి గోపితో మూడు నెలల క్రితం వివాహమైంది. ఇద్దరి కులాలు వేరైనప్పటికీ పెద్దల అంగీకారంతో ఘనంగా వివాహం జరిపించారు.
Samayam Telugu రత్నకుమారి


Also Read: కొడుకు ప్రేమకు బలైపోయిన తండ్రి.. యాదాద్రి జిల్లాలో వ్యక్తి దారుణహత్య

వివాహ సమయంలో రూ.50 వేలు కట్నం ఇవ్వడానికి రత్నకుమారి తల్లిదండ్రులు అంగీకరించారు. అయితే డబ్బు మొత్తం సమకూరకపోవడంతో రూ.45 వేలు మాత్రమే ఇవ్వగలిగారు. అత్తమామలు కట్నం తక్కువగా ఇచ్చారన్న కోపంతో గోపీ భార్యను వేధించడం మొదలుపెట్టాడు. నిత్యం శారీరకంగా, మానసికంగా చిత్రహింసలు పెట్టేవాడు. తన సమస్యను తల్లిదండ్రులకు చెప్పి బాధపెట్టడం ఇష్టం లేని రత్నకుమారి వేధింపులను మౌనంగా భరిస్తూ వచ్చింది.

Also Read: అమ్మాయి కోసం రెండు గ్రూపుల ఘర్షణ.. గుంటూరులో కలకలం రేపిన గ్యాంగ్‌ వార్

అత్తమామలు కూడా భర్తకే వత్తాసు పలకడంతో రత్నకుమారి ఒంటరి అయిపోయింది. ఓ వైపు భర్త చిత్రహింసలు భరించలేక, మరోవైపు తల్లిదండ్రులకు తన బాధ చెప్పుకోలేక మనస్తాపానికి గురైంది. సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తల్లి సునీత ఇచ్చిన ఫిర్యాదు మేరకు తాడికొండ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Also Read: సీఐ వేధింపులు.. మహిళా హెడ్‌‌కానిస్టేబుల్‌ ఆత్మహత్యాయత్నం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.