యాప్నగరం

ప్రియుడి మోసం.. హైదరాబాద్‌లో న్యూస్ ఛానల్ ఉద్యోగిని ఆత్మహత్య

తనతో పనిచేసే శివ అనే యువకుడితో రెండేళ్లుగా ప్రేమలో ఉన్న కళ్యాణి అతడు మోసం చేయడంతో మనస్తాపానికి గురైంది. పెళ్లి చేసుకోనని చెప్పడంతో ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

Samayam Telugu 15 Jul 2020, 8:27 am
ప్రేమ విఫలం కావడంతో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హైదరాబాద్‌లోని గాంధీనగర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో గల బన్సీలాల్‌పేటలో విషాదం నింపింది. సిద్దిపేట ప్రాంతానికి చెందిన పయ్యావుల రాములు కూతురు కళ్యాణి(26) నగరంలోని ఓ న్యూస్ ఛానల్‌లో కొంతకాలంగా పనిచేస్తోంది. బార్బర్ షాపులో పనిచేస్తున్న సోదరుడు సుమన్‌తో కలిసి బోలక్‌పూర్‌లో ఓ గది అద్దెకు తీసుకుని ఉంటోంది. తన సహోద్యోగి శివతో ఆమె రెండేళ్లుగా ప్రేమ వ్యవహారం కొనసాగిస్తోంది. ఇటీవల తనను పెళ్లి చేసుకోవాలని శివను కోరగా అతడు నిరాకరించాడు. అప్పటి నుంచి ఆమెతో మాట్లాడకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. అప్పటి నుంచి ఆమె డిప్రెషన్‌లోకి వెళ్లిపోయింది.
Samayam Telugu కళ్యాణి(ఫైల్ ఫోటో)


Also Read: ప్రేమ పేరుతో మోసం.. పెళ్లికి ముందే గర్భం.. యువకుడి అరెస్ట్

ఈ క్రమంలోనే సుమన్ సోమవారం ఉదయం విధులకు వెళ్లి తిరిగి రాత్రి ఇంటికి రాగా కళ్యాణి ఉరేసుకుని కనిపించింది. దీంతో ఆందోళన చెందిన అతడు వెంటనే గాంధీనగర్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం మంగళవారం కుటుంబసభ్యులకు అప్పగించారు. తన కూతురి మరణానికి శివ కారణమంటూ తండ్రి రాములు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Also Read: ‘నువ్వులేక నేనులేను’ .. భార్య మరణాన్ని తట్టుకోలేక భర్త ఆత్మహత్య

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.