యాప్నగరం

నిశ్చితార్థం కాగానే బావతో హద్దులు దాటిన యువతి.. తండ్రి మందలింపుతో

బావతో నిశ్చితార్థం కాగానే అతడితో చనువుగా ఉండటం మొదలుపెట్టింది కవిత. ఆ యువకుడు తరుచూ ఆమె ఇంటికి వచ్చి ఏకాంతంగా గడిపేవాడు. ఈ విషయాన్ని గమనించిన తండ్రి కవితను మందలించడంతో ఆమె ఆత్మహత్య చేసుకుంది.

Samayam Telugu 31 May 2020, 7:24 am
బంధువుల అబ్బాయితో వివాహం నిశ్చయమైన యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన శనివారం హైదరాబాద్‌లోని మల్కాజిగిరి పోలీసుస్టేషన్‌ పరిధిలోని వెలుగుచూసింది. గుంటూరు జిల్లా దమన్నవారి పాలెంకు చెందిన శివారెడ్డి కొన్నాళ్ల నుంచి మౌలాలిలోని జవహర్‌నగర్‌లో కుటుంబంతో కలిసి నివసిస్తున్నారు. ఆయన కుమార్తె కవిత(20)కు మేనత్త కొడుకుతో కొద్దిరోజుల క్రితం వివాహం నిశ్చయించారు. 15రోజుల క్రితం ఆ అబ్బాయి కవిత ఇంటికి రాగా రాగా ఇద్దరూ చనువుగా ఉండటం శివారెడ్డి గమనించాడు.
Samayam Telugu Image


Also Read: స్నేహితుడి భార్యపైనే కామం.. గదిలో బంధించి రేప్.. ఏలూరులో దారుణం

నిశ్చితార్థం అయినప్పటికీ పెళ్లి కాకుండా అతడితో అంత చనువుగా ఉండటం మంచిది కాదని శివారెడ్డి శుక్రవారం కూతురికి హితబోధ చేశాడు. దీంతో మనస్తాపానికి గురైన కవిత పురుగుల మందు తాగేసింది. కుటుంబసభ్యులు ఆమెను సమీపంలోని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం చనిపోయింది. ఈ సంఘటనపై శివారెడ్డి ఫిర్యాదుతో మల్కాజ్‌గిరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Also Read: సెలవుల్లో ఇంటికొచ్చిన కూతురు... కామంతో రెచ్చిపోయి రేప్ చేసిన తండ్రి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.