యాప్నగరం

టీవీ చూస్తున్నందుకు మందలించిన తండ్రి.. ఉరేసుకున్న యువతి

టీవీ చూస్తున్నందుకు తండ్రి మందలించాడన్న కోపంతో ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన ప్రకాశం జిల్లా పామూరు మండలంలో జరిగింది.

Samayam Telugu 15 Jun 2020, 6:08 pm
‘రోజంతా టీవీ చూస్తూనే ఉంటావా... త్వరలో ఉద్యోగాల నోటిఫికేషన్‌ ఉంది. బాగా ప్రిపేర్ అయి మంచి ఉద్యోగం సాధించు’ అని తండ్రి మందిలించాడన్న మనస్తాపంతో యువతి ఆత్మహత్య చేసుకున్న ప్రకాశం జిల్లా పామూరులో జరిగింది. మండలంలోని బొట్లగూడూరు గ్రామ పంచాయతీ పరిధిలోని కొత్తపల్లె గ్రామానికి చెందిన చీమలదిన్నె మాధవరావు, పద్మ దంపతులకు ఇద్దరు పిల్లలు. కుమార్తె దేవీ ప్రసన్న(20) ఒంగోలులో బీఎస్సీ(అగ్రికల్చర్), కొడుకు విజయవాడలో ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. లాక్‌డౌన్ కారణంగా పిల్లలు రెండున్నర నెలలుగా ఇంట్లోనే ఉంటున్నారు.
Samayam Telugu ప్రసన్న(ఫైల్ ఫోటో)


Also Read: బాలిక స్నానం చేస్తుండగా వీడియో తీసి.. కోరిక తీర్చాలంటూ వేధింపులు

శనివారం రాత్రి టీవీ చూస్తున్న ప్రసన్నను తండ్రి మాధవరావు మందలించాడు. ఉదయం నుంచి రాత్రి వరకు టీవీ చూస్తూనే ఉంటావా, త్వరలో ఉద్యోగాల నోటిఫికేషన్ వస్తోంది, బాగా చదివి ఉద్యోగం సాధించు అని తిట్టాడు. ఆ తర్వాత అందరూ భోజనం చేసి పడుకున్నారు. ఆదివారం తెల్లవారుజామున పద్మ నిద్రలేచి చూడగా ప్రసన్న గదిలో ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. దీంతో ఆమె కేకలు వేయగా మాధవరావు వెంటనే లేచి కూతురిని కిందికి దించి చూడగా అప్పటికే చనిపోయింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఎస్ఐ అంబటి చంద్రశేఖర్ సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. ప్రసన్న మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కనిగిరి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Also Read: 40 మంది మహిళలపై అత్యాచారం.. ఏడేళ్లకు చిక్కిన సీరియల్ రేపిస్ట్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.