యాప్నగరం

దారుణం: అడవిలో యువతి మృతదేహం.. గుర్తుపట్టకుండా ముఖంపై యాసిడ్.!

అటవీ ప్రాంతంలో ఇరవై ఏళ్ల యువతి మృతదేహం కలకలం రేపుతోంది. హత్య చేయక ముందు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Samayam Telugu 20 Jan 2020, 9:04 pm
యువతిని హత్య చేసి.. గుర్తుపట్టకుండా యాసిడ్‌తో ముఖాన్ని కాల్చేసిన దారుణ ఘటన ఆలస్యంగా బయటికొచ్చింది. గుర్తు తెలియని దుండగులు యువతి మృతదేహాన్ని అటవీ ప్రాంతంలో పడవేశారు. యాసిడ్ గాయాలతో గుర్తుపట్టలేనంతగా మారిపోయిన మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ దారుణ ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లో వెలుగుచూసింది.
Samayam Telugu murder6


బహ్రాయిచ్ జిల్లా మూర్తిహ పోలీస్ స్టేషన్ పరిధిలోని కతర్నియా ఘాట్ అటవీ ప్రాంతంలో ఓ యువతి మృతదేహం లభ్యమైంది. సుమారు 20 ఏళ్ల వయసున్న యువతి మృతదేహంపై యాసిడ్‌తో కాల్చిన ఆనవాళ్లున్నాయి. ఆమెను గుర్తించకుండా ఉండేందుకు దుండగులు యువతి ముఖాన్ని యాసిడ్‌ పోసి కాల్చివేసినట్లు అనుమానిస్తున్నారు.

Also Read: గుంటూరు జిల్లాలో దారుణం.. పదకొండేళ్ల బాలికపై అత్యాచారం..

యువతిని హత్య చేయక ముందు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. గ్యాంగ్ రేప్ చేసి ఆపై హత్య చేసి ఉంటారని.. ఆమెను గుర్తించకుండా ఉండేందుకు యాసిడ్‌తో ముఖాన్ని కాల్చివేసి ఉంటారని ఓ పోలీసు అధికారి తెలియజేశారు. యువతిని ఎక్కడో చంపేసి అటవీ ప్రాంతానికి తెచ్చి పడేసి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తం చేశారు.

యువతి హత్య కేసు మిస్టరీని సీరియస్‌గా తీసుకున్న యూపీ సర్కార్.. దర్యాప్తునకు సిట్‌ను ఏర్పాటు చేసింది. డీఎస్పీ స్థాయి అధికారిని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా నియమించింది. దర్యాప్తు అధికారి మాట్లాడుతూ యువతి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపినట్లు తెలిపారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన అనంతరం స్పష్టత వచ్చే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.

Read Also: సమత కేసు: ముగిసిన వాదనలు.. జడ్జిమెంట్ ఎప్పుడంటే..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.