యాప్నగరం

ప్రియుడితో వెళ్లిపోయిన కూతురు.. షాకింగ్ నిర్ణయం తీసుకున్న పేరెంట్స్

కూతురు ప్రియుడితో వెళ్లిపోయి పరువు తీసిందని అవమానంగా భావించిన తల్లిదండ్రులు కొడుకుతో కలిసి వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది.

Samayam Telugu 11 Feb 2020, 12:28 pm
తెలిసీ తెలియని వయస్సులో పిల్లలు చేసే పనులు ఒక్కోసారి వారి తల్లిదండ్రులకు తీవ్ర మనస్తాపానికి గురిచేస్తాయి. ముఖ్యంగా ప్రేమ విషయంలో పిల్లలు వేసే టప్పటడుగులు వారు అవమానంగా భావించి ప్రాణాలు తీసుకునే వరకు దారితీస్తాయి, ఇలాగే మహారాష్టకు చెందిన ఓ యువతి ప్రియుడితో వెళ్లిపోవడాన్ని తట్టుకోలేకపోయిన తల్లిదండ్రులు కొడుకుతో కలిసి ఆత్మహత్య చేసుకున్నారు.
Samayam Telugu 83dc64f51b4b3661ae7f98f6276a245a


Also Read: 40ఏళ్ల వితంతువుతో యువకుడి ప్రేమ... పెద్దలు కాదనడంతో

మహారాష్ట్రలోని గడ్చిరోలి పట్టణం వివేకానందనగర్‌లో రవీంద్ర వరగంటివార్‌(50), భార్య వైశాలి(43), కుమారుడు సాయిరాం, కుమార్తెతో కలిసి నివాసముంటున్నాడు. ఆయన కుమార్తె ఇటీవల ఓ యువకుడితో ప్రేమలో పడింది. ఈ విషయం తెలిసిన తల్లిదండ్రులు పద్ధతిగా ఉండాలని ఆమెను మందలించారు. దీంతో తల్లిదండ్రులు తన ప్రేమకు అడ్డు పడుతున్నారని భావించిన యువతి ఆదివారం ప్రియుడితో కలిసి వెళ్లిపోయింది.

Also Read: వివాహితపై ఆడపడుచు భర్త అత్యాచారం.. న్యూడ్ ఫోటోలు తీసి సోషల్‌మీడియాలో

కుమార్తె కనిపించకపోవడంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికిన తల్లిదండ్రులు అసలు విషయం తెలుసుకుని కంగుతిన్నారు. తమ కూతురు ప్రియుడితో వెళ్లిపోయి కుటుంబ పరువు తీసిందని ఆవేదన చెందారు. పరువే పోయినప్పుడు బతికుండటం ఎందుకని భావించి సోమవారం పట్టణ శివారు సోమానా బైపాస్‌ వద్ద ఆనందనగర్‌ పరిసరాల్లోకి వెళ్లి వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. బావిలో మృతదేహాలను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకుని ముగ్గురి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Also Read: మసాజ్ కోసం పార్లర్‌కి వెళ్తే.. సెక్స్‌ చేసుకోమంటూ ఆఫరిచ్చిన మహిళ

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.