యాప్నగరం

‘4 నెలలు నన్ను వాడుకుని వదిలేశాడు’.. ప్రియుడిపై యువతి ఫిర్యాదు

తనను ప్రేమ పేరుతో ముగ్గులోకి దించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరక వాంఛలు తీర్చుకున్న తర్వాత ప్రియుడు మొహం చాటేశాడంటూ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Samayam Telugu 9 Jul 2020, 9:42 am
పెళ్లి పేరుతో యువతిని నమ్మించి శారీరక వాంఛలు తీర్చుకుని మొహం చాటేసిన యువకుడిపై కేసు నమోదైంది. విశాఖ జిల్లా రాంబిల్లి మండలం కొత్తపట్నం గ్రామానికి చెందిన చింతకాయల కోదండరావు(25) అనే యువకుడు అదే గ్రామానికి చెందిన యువతిని ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు. ఆమె అతడి ప్రేమను అంగీకరించడంతో షికార్లు తిప్పాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుమార్లు శారీరకంగానూ కలిశాడు.
Samayam Telugu Image


Also Read: కీచక బాయ్‌ఫ్రెండ్.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై అత్యాచారం

నాలుగు నెలలుగా ప్రియుడు తనను అన్ని విధాలా వాడుకుంటూ పెళ్లి ప్రస్తావన తీసుకురాకపోవడంతో ఆమెకు అనుమానం వచ్చింది. తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో మొహం చాటేశాడు. ఆమె కంటపడకుండా జాగ్రత్త పడుతున్నాడు. దీంతో మోసపోయానని గ్రహించిన యువతి రాంబిల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎలమంచిలి సీఐ వి.నారాయణరావు బుధవారం రాంబిల్లి ఎస్సైవి.అరుణ్‌కిరణ్‌‌తో కలిసి ఆ గ్రామాన్ని సందర్శించి విచారణ చేపట్టారు. ఆయన ఆదేశాలతో కోదండరావుతో పాటు అతడి తల్లిదండ్రులపైనా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Also Read: గర్భిణి అన్న కనికరం కూడా లేకుండా.. మహిళపై ముగ్గురి గ్యాంగ్ రేప్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.