యాప్నగరం

కర్నూలు: యువకుడిపై యువతి యాసిడ్ దాడి.. వారంలో రెండోసారట

యువకుడిపై వారంలో రెండోసారి యాసిడ్ పోసిన యువతి. ప్రేమించి తనను పెళ్లి చేసుకోలేదని అతడిపై కోపంతో ఉంది.. అంతేకాదు అతడు మరో యువతిని పెళ్లి చేసుకోవడంతో ఆమె కక్ష పెంచుకుంది.

Samayam Telugu 4 Sep 2020, 11:43 pm
కర్నూలు జిల్లాలో దారుణం జరిగింది. నంద్యాల మండలం పెద్దకొట్టాలలో ఓ యువతి యువకుడిపై యాసిడ్‌ దాడి చేసింది. గ్రామానికి చెందిన నాగేంద్ర సుప్రియలు మూడేళ్లగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరి కులాలు వేరని, ప్రేమ పెళ్లికి ఇంట్లో పెద్దలు ఒప్పుకోరని నాగేంద్ర ఆమెతో ప్రేమకు బ్రేకప్‌ చెప్పాడు. అయితే ప్రేమించి తనను పెళ్లి చేసుకోలేదని అతడిపై కోపంతో ఉంది.. అంతేకాదు అతడు మరో యువతిని పెళ్లి చేసుకోవడంతో ఆమె కక్ష పెంచుకుంది. అందుకే నాగేంద్రపై యాసిడ్‌ పోసింది. యువతి గత వారమే అతడిపై యాసిడ్ పోసింది. ఆ ఘటనలో చేయి కాలగా.. పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఆ గాయం నుంచి కోలుకోక ముందే తాజాగా మరోసారి యాసిడ్‌ దాడికి పాల్పడింది.
Samayam Telugu యాసిడ్ దాడి

బాధితుడ్ని కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. దాడిలో అతడికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది.. డాక్టర్లు వైద్యం అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. యువతిని అరెస్ట్ చేసేందుకు సిద్ధమయ్యారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే యువకుడిపై వారం వ్యవధిలోనే రెండుసార్లు యాసిడ్ దాడి జరగడం ఆసక్తికరంగా మారింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.